నోటి దురదకు చెల్లించక తప్పదు మూల్యం.. సైనాకు సారీ చెప్పినా చిక్కుల్లో సిద్దార్థ్.. కొత్త కేసు నమోదు!
నటుడు సిద్ధార్థ్ సైనా నెహ్వాల్ మీద చేసిన కామెంట్స్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం మీద ఆయన క్షమాపణలు చెబుతూ లేఖ కూడా రాశాడు. అయితే ఆయన కష్టాలు తీరినట్టు కనిపించడం లేదు.

ప్రధాని మోదీ భద్రతపై
నిజానికి, ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భారీ భద్రతా లోపం తర్వాత, భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. తన దేశ ప్రధాని తనకు తానుగా సురక్షితంగా లేకుంటే ఏ దేశం కూడా తాను సురక్షితంగా ఉన్నానని చెప్పుకోజాలదని ఆమె ట్వీట్ చేస్తూ రాశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రధాని మోదీపై అరాచకవాదుల దాడిని ఖండించండి అని పెకోండి. నటుడు సిద్ధార్థ్ స్పందిస్తూ, ఆమె అతి చిన్న కాక్ ప్రపంచ ఛాంపియన్ .. భారతదేశానికి రక్షకులు ఉన్నందుకు దేవునికి ధన్యవాదాలు అంటూ వ్యంగ్యంగా అసభ్యకరంగా కామెంట్స్ చేశాడు. ఆ తరువాత ఇందులో అభ్యంతరకరం ఏమీ లేదని సిద్ధార్థ్ తర్వాత స్పష్టం చేశారు. అప్పటి నుంచి, ఈ ట్వీట్ మీద వ్యతిరేకత ప్రారంభమైంది.

ఈ ఘటన దురదృష్టకరమని
సైనా తండ్రి హర్వీర్ సింగ్ నెహ్వాల్, ఆమె భర్త పారుపల్లి కశ్యప్ ముందుకు వచ్చారు, ఈ ఘటన దురదృష్టకరమని అభివర్ణించారు. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ అయితే పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చారు. అంతే కాక కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, స్మృతి ఇరానీలు వ్యతిరేకించడంతో సిద్ధార్థ తన తప్పును గ్రహించాడు. దీంతో క్షమాపణలు చెప్పాడు, అయితే సైనా నెహ్వాల్ అతన్ని నిజంగా క్షమించగలరా?

క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా
ప్రతి ఒక్కరికి వారి స్వంత వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవచ్చు, కానీ ఒకరి మాటలతో ఏకీభవించకపోవడం అంటే అతన్ని బహిరంగంగా దుర్భాషలాడాలని కాదు. బహుశా సిద్ధార్థ కూడా తన చర్యలకు పశ్చాత్తాపపడుతున్నాడు. అందుకే విషయాన్ని సద్దుమణిగించాలని సైనాకు బహిరంగ లేఖ రాశాడు. ప్రియమైన సైనా, మీ ట్వీట్కు ప్రతిస్పందనగా కొన్ని రోజుల క్రితం నేను వ్రాసిన నా అసభ్యకరమైన జోక్కు నేను మీకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. అని పేర్కొన్నారు.

జోక్కి నేను సిగ్గుపడుతున్నా
నేను మీతో ఏకీభవించకపోవచ్చు, కానీ కోపంలో లేదా నిరాశలో కూడా నేను ఉపయోగించిన పదాలు సహా నా మాట సమర్థించబడదు. నా జోక్కి నేను సిగ్గుపడుతున్నాను. నేను ఎప్పుడూ స్త్రీవాదానికి మద్దతుదారుని. ఒక మహిళగా, నేను మిమ్మల్ని ఎగతాళి చేసే ఉద్దేశం లేదు. మీరు నా క్షమాపణను అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. మీరు ఎల్లప్పుడూ నా ఛాంపియన్గా ఉంటారు. అని పేర్కొన్నారు.

దేవుడి ఆశీస్సులు అతనికి ఉండాలి
లేఖపై స్పందించిన సైనా మాట్లాడుతూ... ''మంచిది.. ఇప్పటికైనా అతడు క్షమాపణ కోరాడు, ఒక మహిళను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. నిజానికి నా పేరు ట్విటర్లో ట్రెండ్ అవడం చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడే అతడు నా గురించి ఏం రాశాడో తెలిసింది. అతనితో నేను ఎప్పుడూ నేరుగా మాట్లాడింది లేదు. ఏదేమైనా ఆ దేవుడి ఆశీస్సులు అతనికి ఉండాలి'' అని ఆమె తన హుందాతనాన్ని చాటుకున్నారు.

సిద్ధార్థ్ పై కే
అయితే ఇప్పుడు హైదరాబాద్ సైబర్ సెల్ లో హీరో సిద్ధార్థ్ పై కేసు నమోదయింది. ట్విట్టర్ లో అసభ్యకరమైన మెసేజ్లు పెట్టాడని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఇద్దరు బీజేపీ లాయర్లు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 509, ఐటీ యాక్ట్ సెక్షన్ 67 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.


Click it and Unblock the Notifications











