Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
థియేటర్లో టిక్కెట్లు అమ్ముతున్న సెక్స్ బాంబ్
మైసూరు: టిక్కెట్ తీసుకోవటానికి ధియోటర్ కి వెళితే అక్కడ కౌంటర్లో మీ అభిమాన తార కనిపిస్తే...ఎలా ఉంటుంది. అది నిజం చేయాలనే పూనమ్ పాండే నిర్ణయించుకుంది. తను ఐటం సాంగ్ చేసిన చిత్రం ప్రమోషన్ కోసం థియోటర్ కి వెళ్లి మరీ టిక్కెట్లు అమ్మబోతోంది. బెంగళూరులోని మెయిన్ థియోటర్ ని అందుకోసం ఎంపిక చేసారు. ఈ విషయాన్ని చిత్రం యూనిట్ మీడియాకు తెలియచేసింది. ఆ రోజు ఆ థియోటర్ దగ్గర ఓపినింగ్స్ అదిరిపోతాయన్నమాట. మరి తెలుగులో కూడా ఎవరన్నా ఇలాంటి ప్రయోగం చేస్తే బావుంటుందేమో.
ప్రముఖ నటి పూనంపాండే నగరానికి వచ్చారు. రాత్రి ముంబయి నుంచి బెంగళూరు చేరుకున్న ఆమె ఉదయం రాచనగరికి వచ్చారు. ఉదయాన్నే చాముండేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇటీవల ప్రమాదవశాత్తూ మేడమీద నుంచి పడి దుర్మరణం చెందిన లవ్ఈజ్ పాయిజన్ సినిమా హీరో రాజేష్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ సినిమాలో పూనం పాండే ఓ ప్రత్యేక పాటలో నటించింది.
సినిమా ఈనెల 20న విడుదల కానుంది. సినిమా ప్రచారం కోసమే ఆమె బెంగళూరు వచ్చినట్లు తెలిసింది. విడుదల రోజున బెంగళూరులోని ఓ థియేటర్లో ఆమె కౌంటర్లో కూర్చుని టిక్కెట్లను విక్రయించనుంది. అనంతరం హుబ్లి, హావేరి, తుమకూరు ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొంటారు. సినిమా ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని రాజేష్ కుటుంబానికి అందచేయనున్నట్లు నిర్మాత కేశవమూర్తి తెలిపారు.