Don't Miss!
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- News తెలంగాణలో వచ్చే రెండు రోజులు వానలు: ఆ తర్వాత తీవ్రమైన ఎండలు, ఎల్లో అలర్ట్
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రోబో-2... కోసం అక్షయ్ కుమార్ అంత పని చేసాడా?
హైదరాబాద్: రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘రోబో' చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘2.0' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. తొలుత ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ తో విలన్ రోల్ చేయించాలనుకున్నారు. చివరకు ఆ స్థానంలో అక్షయ్ కుమార్ను ఫిక్స్ చేసారు.
దర్శకుడు శంకర్ ఈ విషయమై అక్షయ్ కుమార్ను సంప్రదించగానే వెంటనే ఒకే చెప్పేసారట. అప్పటికే తాను విపుల్ షా దర్శకత్వంలో ‘నమస్తే ఇంగ్లండ్' సినిమా కమిట్ అయి 4 నెలల డేట్స్ కూడా కేటాయించినప్పటికీ ‘2.0' సినిమా కోసం.... ‘నమస్తే ఇంగ్లండ్' చిత్రం షూటింగును వాయిదా వేసుకున్నాడట అక్షయ్ కుమార్.
ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్తో హై టెక్నికల్ వాల్యూస్తో తెరకెక్కే ఈ చిత్రంగా ‘రోబో 2.0' ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో అసలు ఈ చిత్రానికి ఎంత బడ్జెట్ పెడుతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతోందని నిర్మాత లైకా ప్రొడక్షన్స్ వారు ప్రకటించారు. ఇది ఇండియన్ సినిమాలోనే హై బడ్జెట్ ఇది. 2017 సమ్మర్ లో ఈ చిత్రం విడుదల కానుంది.
3డి ఫార్మాట్లో తీయనున్న ఈసినిమాని ఇంటర్నేషనల్గా రిలీజ్ చేయటానికి ప్లాన్చేశారు. సౌత్ నుంచి ఇంటర్నేషనల్ వరకూ ఓ సినిమాని ఒకే టైటిల్తో ప్రమోట్ చేయటానికి శంకర్ ఈ సినిమా టైటిల్ని 2.0గా మార్చినట్లు చెబుతున్నారు.