Don't Miss!
- News సీఎం ఏటీఎం కార్డు అయ్యాడు, అందుకే టూర్లు వేస్తున్నారు, ఎంతకావాలంటే అంత డబ్బులు !
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అనుకున్న సమయానికే రాబోతున్న ప్రభాస్ పాన్ ఇండియా మూవీ.. దర్శకుడి పర్ఫెక్ట్ ప్లానింగ్!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా అభిమానుల్లో అంచనాలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. డార్లింగ్ కూడా సినిమా సినిమాకు తన మార్కెట్ పెరిగే విదంగా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక ముందుగా రాధేశ్యామ్ సినిమాతో కూల్ గా ఆకట్టుకోవాలని అనుకుంటున్నాడు. ఇక ఈ సినిమా కంటే కూడా అందరి చూపు ఎక్కువగా సలార్ పైనే ఉంది.
KGF టీమ్ తో కలిసి దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ పై కూడా అన్ని భాషల్లో అంచనాలు పెరిగిపోయాయి. KGF 2 హిట్టయిన తరువాతే మార్కెట్ స్టార్ట్ చేయాలని నిర్మాతలు గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక రిలీజ్ పై గత కొంతకాలంగా అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతుండగా దర్శకుడు ప్రశాంత్ నీల్ మొత్తానికి ఒక క్లారిటి అయితే ఇచ్చాడు.
సినిమా షూటింగ్ కోసం ముందు జాగ్రత్తగానే కొన్ని సన్నివేశాలను చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేసేలా ప్లాన్ రెడీ చేసుకుంటున్నట్లు వివరణ ఇచ్చాడు. ఈ లాక్ డౌన్ పూర్తయితే ఫిబ్రవరి నాటికి సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని ఇక సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 14న విడుదల చేస్తామని ప్రశాంత్ నీల్ వివరణ ఇచ్చారు. దీంతో అభిమానుల్లో కన్ఫ్యూజన్ క్లియర్ అయ్యింది. ఇక సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె ఒక జర్నలిస్టు పాత్రలో నెవర్ బిఫోర్ అనేలా కనిపిస్తుందని అంటున్నారు. మరి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.