టెర్రరిస్టుగా జీవిస్తున్న ప్రకాష్ రాజ్
ప్రకాష్ రాజ్ తాజాగా చేస్తున్న పయనం చిత్రంలో టెర్రరిస్టు లీడర్ గా కనిపించనున్నారనే సంగతి తెలిసిందే. ఆయనే స్వయంగా తమిళంలో నిర్మిస్తున్న(తెలుగుకి దిల్ రాజు) ఈ చిత్రంలోని ఆ పాత్రలో లీనమై జీవిస్తున్నట్లు చెప్తున్నారు. తెలుగు, తమిళ బాషల్లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నారు. ఆకాశమంతా ఫమ్ రాధామోహన్ డైరక్ట్ చేస్తున్నారు. ఇక ఈ షూటింగ్ వివరాలు రాధామోహన్ తెలుపుతూ...మొదటి షెడ్యూల్ కులూ మనాలీ లో పూర్తయింది. ఇక రెండో షెడ్యూల్ రామానాయుడు స్టూడియోస్ లో జరుగుతుంది. ఇక మూడో షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక ఎయిర్ పోర్ట్ సెట్ లో జరుగుతుంది. ఓ ధ్రిల్లర్ గా ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది అని చెప్పుకొచ్చారు. ఇక ఈ చిత్రం కాందహార్ సంఘటన ఆదారంగా తెరకెక్కుతున్నట్లు చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే.
ప్రకాష్ రాజ్ నాగార్జున టెర్రరిస్టు దిల్ రాజు రాధామోహన్ ఆకాశమంతా పయనం ఎయిర్ పోర్ట్ prakash raj nagarjuna dil raju payanam air port terrorist


Click it and Unblock the Notifications