Just In
- 55 min ago
అది మాత్రం కంపల్సరీ అంటూ... గోవాలో రాశీ ఖన్నా రచ్చ
- 1 hr ago
మరో నిర్మాత కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల.. నారప్ప తరువాత అదే..
- 1 hr ago
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
- 1 hr ago
రొమాన్స్లో మునిగితేలారు.. అది అలవాటుగా కాదట.. భర్త ఒళ్లో వాలిన పూజా రామచంద్రన్
Don't Miss!
- News
ఎస్సై ఆత్మహత్యను రాజకీయంగా వాడుకుంటారా ? చంద్రబాబు, దేవినేని ఉమపై పోలీస్ అధికారుల సంఘం ధ్వజం
- Sports
IPL 2021: చెన్నై జట్టులోకి రాబిన్ ఊతప్ప.. మీరు మారరంటూ ఫ్యాన్స్ ఫైర్!
- Automobiles
భారత్లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్క్రాస్ విడుదల
- Finance
బడ్జెట్ కంటే ముందు ఏ స్టాక్స్ కొంటే లాభాలు వస్తాయి..?
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రకాష్ రాజ్...అల్జీమర్స్... అరవై ఏళ్లు చామన ఛాయ
హైదరాబాద్: కంగారుపడకండి ప్రకాష్ రాజ్ కు అరవై ఏళ్లు రాలేదు. అలాగే ఆయనకేమీ అల్జీమర్స్ కంప్లైట్ కూడా రాలేదు. నటుడుగా తనను తాను ప్రూవ్ చేసుకుని ఓ టైమ్ లో హీరోగా సైతం తనతో సినిమాలు చేసే స్దాయికి ఎదిగిన ప్రకాష్ రాజ్ ఈ మద్యకాలంలో కాస్త ఖాళీ పడ్డారనే చెప్పాలి. దాంతో వెంటనే ఆయన తన దృష్టిని మొత్తం సినిమా డైరక్షన్ వైపు పెట్టారు.
అయితే ఆయన అన్నీ రీమేక్ లే చేస్తున్నారు. కన్నడ, మళయాళ భాషల్లోని హిట్ చిత్రాల రైట్స్ తీసుకుని రీమేక్ లు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. వాస్తవానికి దర్శకుడిగా ఇప్పటికే మూడు సినిమాలు తీశాడు ప్రకాష్ రాజ్. కానీ సరైన హిట్ పడలేదు. నాలుగో సినిమా 'మన ఊరి రామాయణం' ఇంకొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. అదీ మళయాళంలో వచ్చి హిట్టైన షట్టర్ అనే చిత్రం రీమేక్.

అది రిజల్ట్ దాకా ఆగకుండా .. ఈ లోపే దర్శకుడిగా తన తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు ప్రకాష్. ఈ సినిమాకు ఓ వెరైటీ టైటిల్ ఖాయం చేశాడు ప్రకాష్ రాజ్. 'అరవై ఏళ్లు.. చామన చాయ'.. ఇదీ ప్రకాష్ రాజ్ కొత్త సినిమా పేరు. ఈ సినిమాలో ఆయనే లీడ్ రోల్ చేస్తున్నారు. తెలుగు-తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుంది. అలాగే ఎప్పటిలాగే ఇది డైరెక్ట్ మూవీ కాదు.. రీమేక్.
కన్నడంలో ఈ మధ్యే విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం 'గోధి బన్న సాధారణ మైకట్టు'. ఈ సూపర్ హిట్ చిత్రాన్నే రీమేక్ చెయ్యనున్నాడు ప్రకాష్ రాజ్. కొత్త దర్శకుడు హేమంత్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం కనిపించకుండా పోయిన తండ్రిని వెతుక్కునే కొడుకు కథగా కన్నడ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది.ఈ చిత్రాన్ని ప్రకాష్ రాజ్ తన ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్ తరపున తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో నిర్మించనున్ననట్లు తెలుస్తోంది.
అప్పటిదాకా తండ్రి అంటే చిరాకు పడే కొడుకు.. తండ్రిని వెతికే క్రమంలో ఆయన గొప్పదనం తెలుసుకుంటాడు. చాలా హృద్యంగా సాగే ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా చూడగానే ముగ్ధుడైపోయిన ప్రకాష్ రాజ్.. దానిపై ప్రశంసల జల్లు కురిపించి రైట్స్ తీసేసుకున్నారు. మాతృకలో అనంత్ నాగ్ పోషించిన పాత్రనే ప్రకాష్ రాజ్ చేయనున్నారు. మరి ఆయన కొడుగ్గా నటించేదెవరో త్వరలో తెలియనుంది.