బాయ్ ఫ్రెండుతో హీరోయిన్ ప్రియమణి ఎంగేజ్మెంట్ (ఫొటోస్)
హైదరాబాద్: హీరోయిన్ ప్రియమణి కొంతకాలంగా తన ప్రియుడు ముస్తఫా రాజ్ తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ప్రకటించారు. తాజాగా వీరికి కళ్యాణ గడియలు దగ్గర పడ్డాయి. ఈ నెల 27న బెంగుళూరులో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.
ఎంగేజ్మెంట్ విషయాన్ని ప్రయమణి సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో పాటు ఎంగేజ్మెంట్ రోజు ఇద్దరూ కలిసి దిగిన ఫోటోను కూడా పోస్టు చేసింది. ఈ వేడుకకు ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ రిలేటివ్స్ మాత్రమే హాజరయ్యారని ప్రియమణి తెలిపింది. త్వరలోనే పెళ్లి డేట్ ప్రకటించనున్నారు.
గత మూడు నాలుగేళ్లుగా ప్రియమణి-ముస్తఫా రాజ్ ప్రేమించుకుంటున్నారు. ముస్తఫా రాజ్ ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ చేస్తున్నాడు. ఓ సారి ఐపీఎల్ మ్యాచ్లో ముస్తఫా పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ముస్తఫా యాటిట్యూడ్, అతడి నిజాయితీ, సెన్సాఫ్ హ్యూమర్ నాకు బాగా నచ్చింది అందుకే అతని ప్రేమలో పడిపోయాను అని ప్రియమణి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ప్రియమణి-ముస్తాఫా రాజ్
ప్రియమణి, ముస్తఫా రాజ్ ఎంగేజ్మెంట్ ఫోటో ఇది. ప్రియమణి తన సోషల్ మీడియాలో దీన్ని పోస్టు చేసింది.

టీవీ కార్యక్రమంలో
గతంలో ఓ టీవీ కార్యక్రమంలో ప్రియమణి, ముస్తఫా రాజ్

ప్రవేట్ సెర్మనీగా..
ఈ వేడుకకు ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ రిలేటివ్స్ మాత్రమే హాజరయ్యారని ప్రియమణి తెలిపింది.

ప్రియమణి
త్వరలోనే పెళ్లి డేట్ ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications











