Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సినిమాలు ఆపేస్తామంటూ కార్మికులను హెచ్చరిస్తున్న నిర్మాతలు
వేతనాల పెంపు విషయంలో తాము తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించకపోతే సినిమా నిర్మాణాలు ఆపేస్తామని తెలుగు సినీ నిర్మాతలు కార్మికులను హెచ్చరిస్తున్నారు. కార్మికులు షూటింగులకు రాకపోతే స్వచ్ఛందంగా సినిమా నిర్మాణాలను ఆపేస్తామని వారంటున్నారు. నిర్మాతల మండలికి, ఎపి చలనచిత్ర కార్మిక సంఘాల సమాఖ్యకు మధ్య జరిగిన చర్చలు శుక్రవారం విఫలమయ్యాయి. తాము పెంచిన వేతనాలకు 16 కార్మిక సంఘాలు అంగీకరిస్తుండగా, ఐదు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని నిర్మాతల మండలి ప్రతినిధులు చెప్పారు. ముంబై, చెన్నై, బెంగళూర్ల్లో ఇచ్చే వేతనాల కన్నా తాము ఎక్కువ వేతనాలు ఇస్తున్నామని వారంటున్నారు.
కార్మికుల వేతనాల్లో ఇప్పుడున్న దానికంటే 32 శాతం పెంచేందుకు నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. పెంచిన వేతనాలతోపాటు ఒప్పందపత్రాలను త్వరలోనే వారికి అందజేస్తామని నిర్మాతల మండలి సభ్యుడు దగ్గుబాటి సురేష్ ఈరోజు మీడియాతో చెప్పారు. జూనియర్ ఆర్టిస్టులకు దినసరి వేతనం రూ. 450 ఇవ్వటానికి సిద్ధమని కూడా ఆయన ప్రకటించారు. 60 శాతం వరకు పెంచాలని వారు కోరుతున్నారని అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని అన్నారు. కార్మికచట్టం కంటే ఎక్కువగానే తాము పెంచుతామన్నామని అన్నారు. కార్మికులు అంగీకరించకపోతే ఇతర రాష్ట్రాల కార్మికులతో పనిచేయించుకునేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారన్నారు.