Just In
- 4 min ago
‘సింహాద్రి’ విజయంలో ఆయనదే కీలక పాత్ర: నిర్మాత మరణంపై ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
- 37 min ago
RED box office: 4వ రోజు కూడా కొనసాగిన రామ్ హవా.. ఇప్పటివరకు వచ్చిన లాభం ఎంతంటే..
- 56 min ago
బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో: ఆ రికార్డులపై కన్నేసిన నటసింహం.. భారీ ప్లానే వేశాడుగా!
- 1 hr ago
అదిరింది షో గుట్టురట్టు చేసిన యాంకర్: అందుకే ఆపేశారంటూ అసలు విషయం లీక్ చేసింది
Don't Miss!
- News
అర్నబ్తో బార్క్ సీఈవో వాట్సాప్ ఛాట్- దేశ భద్రతకు ప్రమాదమన్న కాంగ్రెస్
- Lifestyle
Mercury Transit in Aquarius : బుధుడు కుంభరాశిలోకి ఎంట్రీ.. ఈ రాశుల వారు జర భద్రం...!
- Finance
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 200 పాయింట్లు డౌన్: మెటల్, బ్యాంకింగ్ పతనం
- Automobiles
సరికొత్త జావా ఫోర్టీ టూ మోడల్ వస్తోంది.. స్పై చిత్రాలు, వివరాలు
- Sports
మ్యాచ్కు అంతరాయం.. ముగిసిన నాలుగో రోజు ఆట!! గెలవాలంటే భారత్ 324 కొట్టాలి!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘ఆగని అరెస్టుల మద్య ఆగిన ‘పులి’ ప్రదర్శనలు...
'కొమరం పులి" విడుదలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణావాదుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణా జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తగా పలువురు తెలంగాణా నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. తెలంగాణా వాదం బలంగా వినిపించే వరంగల్ రామ్ బిగ్ సినిమా, హన్మకొండలోని అమతా థియేటర్ల ముందు భారీగా తెంగాణా వాదులు చేరుకుని చిత్రానికి సంబంధించిన పోస్టర్లు చించి వేస్తూ ఓయు జేఏసీ పులిని అడ్డుకోవాలంటూ ఇచ్చిన పోస్టర్లను అంటించారు. మరోవైపు నల్గొండ జిల్లాలోని సూర్యాపేట, కొదాడ, నకిరేకల్, భువనగిరి తదితర ప్రాంతాల్లో తెలంగాణా వాదులు చిత్ర ప్రదర్శనని అడ్డుకోవటంతో దాదాపు 70మందిని అరెస్టు చేసినప్పటికీ సినిమా ప్రదర్శించడానికి యాజమాన్యాలు నిరాకరించినట్టు సమాచారం.
అలాగే ఖమ్మం జిల్లాలోని కొత్త గూడెంలో దుర్గ, పూర్ణ థియేటర్ల వద్ద సినిమాని నిలపి వేసినప్పటికీ ఆందోళన కారులు సినిమా పేరు మార్చాలంటూ నినాదాలు చేస్తున్నారు. అలాగే మైదరాబాద్ నగర శివార్ల లో కూకట్ పల్లిలోనూ ఈ రోజు చిత్ర ప్రదర్శన రద్దు చేస్తున్నట్లు శివపార్వతి థియేటర్ యాజమాన్యం ప్రకటించగా..నాచారంలోని వైజయంతి ధియేటర్ లోనూ పులి ప్రదర్శనకి బ్రేక్ పడింది. మల్కజ్ గిరి సాయిరాం థియేటర్ ముందు జేఏసి నేత గౌరీష్, వెంకన్నల నేతత్వంలో నిరసన ప్రదర్శన చేయటంతో ప్రదర్శన నిలిపి వేశారు.
కాగా 'కొమరం పులి" ప్రదర్శించే థియేటర్ల ముందు ఆందోళన చేస్తుండటంతో పలుచోట్ల ప్రీమియర్ షోలతో పాటు మార్నింగ్ షో, మ్యాట్నీలను నిలిపివేసేందుకు థియేటర్ యాజమాన్యాలు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.