Don't Miss!
- Sports T20లో డబుల్ సెంచరీ: ఆ భారత ప్లేయర్కే సాధ్యం- విలియమ్సన్
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- News తెలంగాణలో నామినేషన్లను దాఖలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
తమ్ముడు బాలకృష్ణ ఓ ఉగ్రనరసింహం...పురందేశ్వరి
తమ్ముడు బాలకృష్ణ ఓ నటసింహంలా, ఓ ఉగ్రనరసింహంలా తనలోని నటనని చాటుకున్న చక్కని సందేశాత్మక చిత్రం ఇదని భావిస్తున్నా. నేడు ఒక పౌరాణికం కానీ, ఒక జానపదం కానీ, ఒక సాంఘికం కానీ చెయగల నటుడు ఒక్క బాలకృష్ణ మాత్రమే. తమ్ముడు సంపూర్ణ నటుడు అని చెప్పగలను అన్నారు కేంద్ర మంత్రి పురందేశ్వరి.
రాజ్యసభ సభ్యులు టి. సుబ్బిరామిరెడ్డి అధ్యక్షతన వంశీ ఫిల్మ్ సొసైటీ ఏర్పాటుచేసిన సభలో ఆమె పరమవీరచక్ర చిత్రం గురించి మాట్లాడుతూ ఇలా స్పందించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ..."నా యాభయ్యోయేట దాసరి 150వ చిత్రంలో నటించడం చాలా సంతోషం. ప్రతి పౌరుడూ వీర జవాను కావాలనీ, అలాంటి చట్టం తేవాలనీ కోరుతున్నా అన్నారు. తర్వాత మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య మాట్లాడుతూ "మన సైనిక శక్తిని బాలకృష్ణ తన పాత్రలో అద్భుతంగా ప్రదర్శించారు. 150 కాదు, ఇంకో 150 సినిమాలు తీయడానికి సిద్ధంగా ఉన్న దర్శకుడు దాసరి. నాలుగు రోజుల తర్వాతైనా ఈ చిత్రాన్ని ప్రేక్షకలోకం ఆదరిస్తుంది. ఇది ఉత్కృష్టకోవకు చెందిన చిత్రం" అని చెప్పారు.