పూరి జగన్నాధ్, అమితాబ్ ల సినిమా ప్రారంభం
బిగ్ బి అమితాబ్ బచ్చన్, పూరి జగన్నాద్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ నిన్న అనగా సోమవారం(మార్చి 7, 2011) ముంబైలో మొదలైంది. 'బుడ్డా బన్గయా తేరా బాప్' పేరుతొ ఈ చిత్రం రూపొందుతుంది. హేమమాలిని హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలోమారో ముగ్గురు యంగ్ హీరోయిన్స్ నటిస్తున్నారు. అందులో ఒకరిగా చార్మీ ఎంపికయ్యారు. కాగా మొదటిరోజు షూటింగ్ లో అమితాబ్ పాల్గొనలేదు. ఈ నెల 23 నుంచి జరగనున్న రెగ్యులర్ షూటింగ్ లో ఆయన పాల్గొంటారు. పూరి జగన్నాద్ దర్శకత్వం వహిస్తున్న తొలి బాలీవుడ్ చిత్రమిది. ఇక పూరి రూపొందించిన నేనూ నా రాక్షసి చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం అనంతరం మహేష్ కాంబినేషన్ లో ది బిజినెస్ మ్యాన్ చిత్రం ప్రారంభిస్తారు.
More from Filmibeat
అమితాబ్ బచ్చన్ పూరీ జగన్నాధ్ నేనూ నా రాక్షసి ది బిజెనెస్ మ్యాన్ amithab bachchan puri jagannath nenu naa rakshasi the business man


Click it and Unblock the Notifications











