Don't Miss!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- News కాకినాడలో పవన్ పై జగన్ విమర్శల్లో తడబాటు..! పాలకొల్లులో పోటీ, నాలుగో సీటు...
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
పవన్ కోసమే ఆ డ్రామా ఆడా:పూరీ
పూరి మాట్లాడుతూ... బద్రి తమాషా కథ. ఓ అబ్బాయి ఒకేసారి ఇద్దరు అమ్మాయిల్ని ప్రేమిస్తాడు. నిజానికి ఈ కథ ఎవరికి చెప్పినా ఒప్పుకోరు. కానీ సరిగ్గా తీస్తే ప్రేక్షకులు నెత్తిమీద పెట్టుకొంటారని నాకు తెలుసు. అప్పటికి నాకు పవన్ కల్యాణ్తో పరిచయం లేదు. శ్యామ్ కె.నాయుడు ద్వారా చోటా కె.నాయుడుని కలుసుకొన్నా. 'నాకు కథ వినిపించు. నచ్చితే పవన్కి సిఫారసు చేస్తా' అన్నారు.
నా కథను చోటా.కె. సరిగ్గా అర్థం చేసుకొంటారో లేదో అని.. ఆయనకు 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' కథ చెప్పా. అది చోటాకి బాగా నచ్చింది. వెంటనే పవన్కి నన్ను పరిచయం చేశారు. పవన్ కల్యాణ్కి 'బద్రి' కథ వినిపించా. తనకి కథ నచ్చింది గానీ, 'ఏదో ఆత్మహత్య కథ అన్నాడు.. నువ్వేమో ఇది చెప్పావ్..' అని అడిగారు. 'మిమ్మల్ని కలుసుకోవడానికి నేను ఆడిన డ్రామా అది..' అని నిజం చెప్పేశా. అలా నా మొదటి సినిమా 'బద్రి'కి అంకురార్పణ జరిగింది అన్నారు.
నితిన్ హీరోగా నటించిన తన తాజా చిత్రం హార్ట్ ఎటాక్ భారీ ఓపెనింగ్స్ సాధించిందని, విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోందని పూరీ జగన్నాథ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 'తొలిరోజు నైజాం ఏరియాలో ఒక కోటి తొమ్మిది లక్షల షేర్ వసూలు చేసి నితిన్ సినిమాల్లో రికార్డ్ నెలకొల్పింది. మిగతా ఏరియాల్లోనూ కలెక్షన్లు చాలా బాగున్నాయ'ని పూరీ జగన్నాథ్ చెప్పారు.