Don't Miss!
- News Arvind Kejriwal: బెయిల్ కోసం కేజ్రీవాల్ పాట్లు, జైల్లో అవి తింటున్నారట!!
- Sports T20లో డబుల్ సెంచరీ: ఆ భారత ప్లేయర్కే సాధ్యం- విలియమ్సన్
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
జగన్ డైరెక్షన్లో జూ ఎన్టీఆర్, అధికార ప్రకటన త్వరలో...!?
జగన్ డైరెక్షన్లో జూ ఎన్టీఆర్ సినిమా యువ కథానాయకుడు జూ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఊసరవెల్లి' చిత్రంతో బాటు, బోయపాటి శ్రీను డైరెక్షన్లో క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మిస్తున్న చిత్రంలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో 'ఊసరవెల్లి' సినిమా దాదాపు పూర్తికావచ్చింది. ప్రస్తుతం హైదరాబాదు శివారులోని విజయా ఎలట్రికల్స్ లో దీని క్లైమాక్స్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంచితే, వీటి తర్వాత చేయబోయే తన తదుపరి ప్రాజక్టుల గురించి జూ ఎన్టీఆర్ మరోపక్క డిస్కషన్స్ లో పాల్గొంటున్నాడు.
ఇందులో భాగంగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో ఓ సినిమా ప్లానింగ్ జరుగుతోంది. తాజాగా జూ ఎన్టీఆర్, జగన్నాథ్ కలిసి ఈ సినిమా గురించి చర్చించుకున్నారు కూడా. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. గతంలో వీరి కాంబినేషన్లో 'ఆంధ్రావాలా' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే! ఇక మహేష్ తో చేయనున్న ది బిజినెస్ మ్యాన్ చిత్రం అనంతరం ఈ సినిమాను ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. శక్తి ప్లాప్ అనంతరం ఎన్టీఆర్ కథలో విషయంలో చాలా జాగ్ర్తత్తలు తీసుకుని ఓకే చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇక పూరీ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందే చిత్రం పూర్తి స్దాయి మాస్ ఎంటర్టైనర్ అంటున్నారు.