Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
శ్రుతిహాసన్ పై కేసు వెనక్కి...తెర వెనుక రాజీ
హైదరాబాద్: ప్రముఖ నటి శ్రుతిహాసన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ సిటీ సివిల్ కోర్టులో పిక్చర్ హౌజ్ మీడియా సంస్థ అర్జీ దాఖలు చేసింది. దీనిపై కోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఊహించని విధంగా పివిపి వారు కేసుని ఉపసంహరించుకున్నారు. కోర్టు బయిట తమిళ నిర్మాతల సంఘం ఈ కేసుని రాజికి వచ్చే ప్రయత్నం చేసి విజయం సాధించింది. శృతి హాసన్ వరసగా తమిళ సినిమాలు చేస్తున్న నేపధ్యంలో తమకు దెబ్బ అనుకున్న పెద్ద తమిళ నిర్మాతలు కలుగచేసుకోవటం శృతికు కలిసి వచ్చింది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
రెండు రోజుల క్రితం... న్యాయస్థానానికి శ్రుతిహాసన్ తరపున న్యాయవాది వివరణ ఇస్తూ.. శ్రుతికి పిక్చర్ హౌజ్ మీడియా సంస్థ ఎలాంటి ముందస్తు చెల్లింపులు ఇవ్వలేదని, శ్రుతిని వేధించేందుకే కేసు దాఖలు చేశారని కోర్టుకు తెలిపారు. శ్రుతిహాసన్ స్థానంలో తమన్నాను ఎంపిక చేసి సినిమా చిత్రీకరణ చేశారని, శ్రుతి కొత్త సినిమాలు ఒప్పుకోవద్దన్న ఉత్తర్వులను తొలగించాలని న్యాయస్థానాన్ని కోరారు. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదాపడింది.
తెలుగు,తమిళ భాషల్లో రాణిస్తున్న శృతిహాసన్ కెరీర్ కు అర్దాంతరంగా బ్రేకులు పడ్డాయి. ఆమె ఏ కొత్త సినిమా ఒప్పుకోకూడదని, క్రిమినల్ ఇన్విస్టిగేషన్ చెయ్యమని చెన్నై కోర్టు ఆర్డర్ వేసింది. పిక్చర్ హౌస్ మీడియా లిమిటెడ్ (హైదరబాద్,చెన్నై) వారు ఈమెపై సివిల్ మరియు, క్రిమినల్ ప్రొసీడిగ్స్ జరపమని కోరారు.
తమ సంస్థ నిర్మించే సినిమా విషయంలో ముందస్తు ఒప్పందాన్ని కథానాయిక శృతిహాసన్ ఉల్లంఘించిందని చెన్నై, హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థ పిక్చర్హౌస్ మీడియా లిమిటెడ్ ఆమెపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కేసు దాఖలు చేసింది. ఈ కేసును విచారించిన కోర్టు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొత్త సినిమాలకు శృతిహాసన్ సంతకం చేయకూడదని ఇంజక్షన్ ఆర్డర్నిచ్చింది.
ఈ కేసును విచారించి చర్యలు చేపట్టాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. కేసుకు దారితీసిన పరిస్థితుల్ని తెలియజేస్తూ పిక్చర్హౌస్ మీడియా సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..నాగార్జున, తమిళ నటుడు కార్తి కాంబినేషన్లో వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కథానాయికగా నటించడానికి శృతిహాసన్ అంగీకరించింది. అందుకుగాను పిక్చర్హౌస్ మీడియా సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా షూటింగ్లో శృతిహాసన్ ఇప్పటివరకు పాల్గొనలేదు. ఇతర సినిమాల కమిట్మెంట్స్ కారణంగా డేట్స్ను సర్దుబాటు చేసుకోలేకపోతున్నానని, అందుకే సినిమా నుంచి తప్పుకుంటున్నానని శృతిహాసన్ ఈ మెయిల్ ద్వారా తెలియజేసింది. ఈ సినిమా విషయంలో ఆమెతో పూర్తిస్థాయి చర్చలు జరిపిన తర్వాతే, ఆమెకు అనుకూలమైన డేట్స్ను తీసుకోవడం జరిగింది.
అర్థాంతరంగా ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించడంతో మా సంస్థకు కోట్లలో నష్టం వాటిల్లింది. శృతిహాసన్ వృత్తి వ్యతిరేక బాధ్యతారాహిత్య ప్రవర్తన వల్ల మా సంస్థ పేరుప్రతిష్టలకు భంగం కలిగే ప్రమాదం కూడా వుంది. దాంతో పాటు ఇతర ఆర్టిస్టుల సమయం కూడా వృధా అవుతుంది. ఇలాంటి వృత్తిధర్మ వ్యతిరేక చర్యలు పునరావృతం కాకూడదని శృతిహాసన్పై కేసు వేశాం అని పిక్చర్హౌస్ మీడియా సంస్థ పేర్కొంది.