Don't Miss!
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వరం కాదది.. శాపం
సినిమా మీద ఆసక్తి వుండే దిగువ తరగతి ప్రేక్షకులు కింది స్థాయి టిక్కెట్లు తక్కువగా వుండటంతో పైస్థాయి టిక్కెట్లను కొంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భారమంతా సామాన్యుల మీదనే పడుతోంది. మా సినిమాలకు ఇది చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. టిక్కెట్ రేట్లు పెరగటం వల్ల ఇప్పటికే అధికంగా వున్న థియేటర్ అద్దెలు మరింతగా పెరిగే ప్రమాదముంది. ఇదివరకు పర్సంటేజి విధానం అమల్లో వున్నప్పుడు పరిశ్రమ కళకళలాడుతూ వుండేది. నేడు కొంతమంది గుత్త పెట్టుబడిదార్లు కబ్జాచేసి, థియేటర్లను తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారు.
అద్దెలను విపరీతంగా పెంచేశారు. ఫలితంగా 80 శాతం నిర్మాతలు క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. నిర్మాతల్లోని ఒక వర్గమే ఈ టిక్కెట్ ధరల పెంపుకు కారణం. నిజంగా వాళ్లు పరిశ్రమ మేలు కోరేవాళ్లయితే ముందుగా థియేటర్లలోని నేల, బెంచీ సీట్లను 60 శాతానికి పెంచాలి. టిక్కెట్ ధరల పెంపు విషయమై తీసుకు రావాలనుకుంటున్న జీవోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. అంతేకాక, థియేటర్ల అద్దె విధానం మీద అది దృష్టిపెట్టాలి. సీట్ల పర్సంటేజి సక్రమంగా వుండేలా చర్యలు తీసుకోవాలి'' అని ఆయన డిమాండ్ చేశారు.