వరం కాదది.. శాపం

సినిమా మీద ఆసక్తి వుండే దిగువ తరగతి ప్రేక్షకులు కింది స్థాయి టిక్కెట్లు తక్కువగా వుండటంతో పైస్థాయి టిక్కెట్లను కొంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భారమంతా సామాన్యుల మీదనే పడుతోంది. మా సినిమాలకు ఇది చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. టిక్కెట్ రేట్లు పెరగటం వల్ల ఇప్పటికే అధికంగా వున్న థియేటర్ అద్దెలు మరింతగా పెరిగే ప్రమాదముంది. ఇదివరకు పర్సంటేజి విధానం అమల్లో వున్నప్పుడు పరిశ్రమ కళకళలాడుతూ వుండేది. నేడు కొంతమంది గుత్త పెట్టుబడిదార్లు కబ్జాచేసి, థియేటర్లను తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారు.
అద్దెలను విపరీతంగా పెంచేశారు. ఫలితంగా 80 శాతం నిర్మాతలు క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. నిర్మాతల్లోని ఒక వర్గమే ఈ టిక్కెట్ ధరల పెంపుకు కారణం. నిజంగా వాళ్లు పరిశ్రమ మేలు కోరేవాళ్లయితే ముందుగా థియేటర్లలోని నేల, బెంచీ సీట్లను 60 శాతానికి పెంచాలి. టిక్కెట్ ధరల పెంపు విషయమై తీసుకు రావాలనుకుంటున్న జీవోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. అంతేకాక, థియేటర్ల అద్దె విధానం మీద అది దృష్టిపెట్టాలి. సీట్ల పర్సంటేజి సక్రమంగా వుండేలా చర్యలు తీసుకోవాలి'' అని ఆయన డిమాండ్ చేశారు.


Click it and Unblock the Notifications











