మణిరత్నంతో ఒక్కసారి.. ఎదురుచూస్తున్న బాలీవుడ్ హీరోయిన్
మణిరత్నం సార్ తీసిన యువ, గురు చిత్రాలంటే చాలా ఇష్టమని రైమా సేన్ వెల్లడించారు.
భారతీయ చిత్రాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు మణిరత్నంతో ఎవరైనా పనిచేయాలని ఆశపడటంలో తప్పేమీ ఉండదు. తాజాగా ఆ జాబితాలో బాలీవుడ్ నటి రైమా సేన్ చేరింది.

'బాలీవుడ్లో ఈ ఏడాది ఐదు చిత్రాలు విడుదల కానున్నాయి. అవి సకాలం విడుదలై మణిరత్నం దృష్టిని ఆకర్షించాలని కోరుకొంటున్నాను. ఆ చిత్రాలు చూసి ఆయన అవకాశం ఇస్తే ఇక నా జీవితం ధన్యమవుతుంది' అని రైమా సేన్ ఇటీవల మీడియాతో అన్నారు.
మణిరత్నం సార్ తీసిన యువ, గురు చిత్రాలంటే చాలా ఇష్టమని వెల్లడించారు. చోకర్ బాలీ, పరిణిత, తీన్ పత్తి చిత్రాల్లో నటించిన ఈ బెంగాళీ భామ గతేడాది ఐదు చిత్రాల్లో నటించింది. ఆ చిత్రాలన్నీ ఈ ఏడాదిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











