Don't Miss!
- News డెడ్ లైన్ పెట్టిన ఎంపీ సుమలత, ఆ రోజు తేలిపోతుంది, టెన్షన్ పడుతున్న మాజీ సీఎం !
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
రవితేజ చాలా మారిపోయాడు, ఈ ఫోటో చూసారా?
రవితేజ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్) సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సోమవారం (ఏప్రిల్ 3)న ప్రారంభం అయింది.
హైదరాబాద్: ఈ మధ్య రవితేజ సినిమాలు రాక పోవడంతో రకరకాల పుకార్లు. రవితేజ పూర్తిగా సినిమాలకు దూరం అవుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని తేలిపోయింది. ప్రస్తుతం రవితేజ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్) సినిమా చేస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ సోమవారం (ఏప్రిల్ 3)న ప్రారంభం అయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. నెక్ట్స్ వీక్ చిత్ర యూనిట్ డార్జిలింగ్ వెలుతోంది. అక్కడ సినిమాకు సంబంధించిన మేజర్ పార్ట్ షూట్ చేయబోతున్నారు.
రవితేజ చాలా మారిపోయాడు
ఆ మధ్య చాలా బక్క చిక్కి అదో రకమైన లుక్ లో కనిపించిన రవితేజ.... ఈ గ్యాపులో తన బాడీ ఫిట్ నెస్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు. రవితేజకు సంబంధించిన తాజా ఫోటో ఇది. మళ్లీ మన పాత రవితేజను చూసినట్లు ఉంది కదూ...
రాజా ది గ్రేట్
రవితేజ, మెహరీన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న రాజా ది గ్రేట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్ నిర్మాతగా తెరకెక్కుతోంది. వెల్కమ్ టు మై వరల్డ్ అనేది చిత్ర ఉప శీర్షిక. ఈ చిత్రానికి సమర్పణః దిల్ రాజు,
ఇప్పటి వరకు రవితేజ చేయని విలక్షణమైన పాత్రలో
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ - ``రవితేజగారితో చేస్తున్న డిపరెంట్ కాన్సెప్ట్ మూవీ. ఇప్పటి వరకు రవితేజగారు చేయని విలక్షణమైన పాత్రలో కనపడతారు అని తెలిపారు.
రవితేజ మరో మూవీ టచ్ చేసి చూడు
దీంతో పాటు రవితేజ బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ నిర్మిస్తున్న ‘టచ్ చేసి చూడు' అనే సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ చత్రం ద్వారా విక్రమ్ సిరికొండ దర్శకునిగా పరిచయవుతున్నారు.