Don't Miss!
- News Astrology: రేపటి నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘ఐస్ క్రీమ్’ చిత్రం గురించి రాజమౌళి
హైదరాబాద్ : రామ్ గోపాల్ వర్మ తాజా హర్రర్ చిత్రం 'ఐస్ క్రీమ్'. నవదీప్, తేజస్వనీ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం గురించి రాజమౌళి రీసెంట్ గా ట్వీట్ చేసి తన అభిప్రాయాన్ని తెలియచేసారు. ఆయన మాట్లాడుతూ..." ఐస్ క్రీమ్ చిత్రాన్ని కంటెంట్ పరంగా ఉదాహరణగా తీసుకోవద్దు... కేవలం వర్కింగ్ మోడల్ మాత్రమే తీసుకోండి ." అన్నారు.
ఇక విభిన్న కథాంశాలతోనే కాకుండా డిఫరెంట్ టైటిల్స్తో సినిమాలు తీసే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం 'ఐస్క్రీమ్'. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నవదీప్ హీరో. తేజస్వి హీరోయిన్. ఈ చిత్రం మొన్న శనివారం విడుదలై ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం రివ్యూలపై కాంట్రావర్శి కూడా వచ్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం సీక్వెల్ ని వర్మ ప్రకటించారు. ఈ చిత్రం పోస్టర్ ని సైతం విడుదల చేసారు.
ఈ సీక్వెల్ చిత్రాన్ని సైతం వర్మ నాన్స్టాప్ షెడ్యూల్తో షూటింగ్ పూర్తి చేస్తామని చెప్తున్నారు, ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనిలో నిమగ్నమయ్యారు. స్పీడుగా షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ లో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రం సైతం లో బడ్జెట్ లో పూర్తి చేయనునట్లు చెప్తున్నారు.
టైటిల్కు తగ్గట్లుగానే వర్మ ఇప్పటివరకూ తీసిన చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. 'ఐస్క్రీమ్' చిత్రానికున్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. తన మొదటి సినిమా 'శివ'తో స్టడీకామ్ కెమెరాను పరిచయం చేసిన రాము తాజాగా ఈ చిత్రంలో ఫ్లోకామ్ అనే కెమెరాను ఉపయోగించారు. దీనిని ఆసియాలోనే తొలిసారిగా ఉపయోగించిన దర్శకుడు వర్మ అని చెప్పాలి. ఫ్లోకామ్తో చిత్రీకరించిన సన్నివేశాలను చూసిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతి పొందుతారని యూనిట్ సభ్యులు చెప్పారు.