Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రాజమౌళిలా మాస్ పల్స్ పట్టడం మరే డైరెక్టర్ కి రాదు...
డైరెక్టర్ రాజమౌళి తెలుగు చిత్ర పరిశ్రమకి ఎన్నో సూపర్ హిట్స్ అందించాడు. మాస్ హీరోయిజంని హైట్స్ కి తీసుకుపోయి సంచలనాలు సృష్టించడంలో తనకి తానే సాటి అనిపించాడు. రాజమౌళిలా మాస్ పల్స్ పట్టడం మరెవరికీ రావట్లేదు. అందుకే ఏ స్టార్ డైరెక్టర్ శైలినైనా అవలీలగా అనుకరించే సినీ మేథావులు రాజమౌళి జోలికెళ్లట్లేదు. అంతెందుకు రాజమౌళి వద్ద శిష్యరికం చేసిన వారికి కూడా అతని గుణగణాలు అబ్బడం లేదు. అందుకే రాజమౌళి శిష్యగణమంతా కట్టగట్టుకుని ప్లాపయ్యారు. ఇక రాజమౌళి సినిమాలని రీమేక్ చేయడం కూడా అషామాషి వ్యవహారం కాదు. ఇది గతంలోనే చాలా సార్లు రుజువయింది.
తాజాగా కన్నడంలో తుషార్ రంగనాథ్ దర్శకత్వంలో దునియా విజయ్ హీరోగా వచ్చిన 'కంఠీరవ" అనే సినిమాతో అది మరింత స్పష్టంగా తెలిసిపోయింది. జూ ఎన్టీఆర్ నటించిన 'సింహాద్రి"సినిమాకి రీమేక్ అయిన ఈ చిత్రం ఘోరంగా ప్లాపయింది. రాజమౌళి స్ర్కీన్ ప్లేని యథాతథంగా కాపీ కొట్టినా కానీ కన్నడ దర్శకుడికి రాజమౌళి మ్యాజిక్ చేయడం చేతకాలేదు. దాంతో కంఠీరవ అత్యంత ఘోరంగా మట్టి కరిచాడు. ఇకపై రాజమౌళి సినిమాల్ని రీమేక్ చేయాలనుకునేవారికి 'తస్మాత్ జాగ్రత్త" అంటూ హెచ్చరికలు పంపాడు....