నాగార్జునని ఓ ధీరోదాత్తుడిగా చూపించిన రాజమౌళి...?
అక్కినేని నాగార్జున హీరోగా ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రాజన్న సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రామాలు జరుపుకుంటుంది. ఈ సినిమా ఆడియోని ఈ నెల 27న రిలీజ్ చేసి సినిమాని డిసెంబర్ 22న విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. విజయేంద్ర ప్రసాద్ చెప్పిన కథకి బాగా ఇంప్రెస్ అయిన నాగార్జున ఈ సినిమాని తన సొత బ్యానర్ అన్నపూర్ణా స్టూడియోస్ పతాకంపై భారీ వ్యయంతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
తెలంగాణా ప్రాంతంలో నిజాం పాలకులు పాలనలో రజాకారుల ఆకృత్యాలకు వ్యతిరేకంగా ఆదివాసీలకు అండగా పోరాడిన గిరిజన యోధుడుగా నాగార్జున ఈ సినిమాలో కనిపించబోతున్నారట. ఈ చిత్రాన్ని ఆదివాసీల హక్కుల కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఓ ధీరోదాత్తుడి కథగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో కీలక సన్నివేశాలను రాజమౌళీ తెరకెక్కించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
నాగార్జునే స్వయంగా నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. నాగార్జున మొడటి సారిగా ఓ ఫెరోషియస్ క్యారెక్టర్ లో నటించిన ఈ చిత్రంలో ఓ పాప పాత్ర ప్రధాన ఆకర్షణ కానున్నాయని సమాచారం.


Click it and Unblock the Notifications











