Don't Miss!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నాగార్జునని ఓ ధీరోదాత్తుడిగా చూపించిన రాజమౌళి...?
అక్కినేని నాగార్జున హీరోగా ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రాజన్న సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రామాలు జరుపుకుంటుంది. ఈ సినిమా ఆడియోని ఈ నెల 27న రిలీజ్ చేసి సినిమాని డిసెంబర్ 22న విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. విజయేంద్ర ప్రసాద్ చెప్పిన కథకి బాగా ఇంప్రెస్ అయిన నాగార్జున ఈ సినిమాని తన సొత బ్యానర్ అన్నపూర్ణా స్టూడియోస్ పతాకంపై భారీ వ్యయంతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
తెలంగాణా ప్రాంతంలో నిజాం పాలకులు పాలనలో రజాకారుల ఆకృత్యాలకు వ్యతిరేకంగా ఆదివాసీలకు అండగా పోరాడిన గిరిజన యోధుడుగా నాగార్జున ఈ సినిమాలో కనిపించబోతున్నారట. ఈ చిత్రాన్ని ఆదివాసీల హక్కుల కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఓ ధీరోదాత్తుడి కథగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో కీలక సన్నివేశాలను రాజమౌళీ తెరకెక్కించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
నాగార్జునే స్వయంగా నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. నాగార్జున మొడటి సారిగా ఓ ఫెరోషియస్ క్యారెక్టర్ లో నటించిన ఈ చిత్రంలో ఓ పాప పాత్ర ప్రధాన ఆకర్షణ కానున్నాయని సమాచారం.