Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సచిన్కు సూపర్ స్టార్ రజనీకాంత్ ఆశీస్సులు.. థ్యాంక్యూ తలైవా అంటూ..
సచిన్ టెండూల్కర్ జీవిత కథ ఆధారంగా సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ అనే పేరుతో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.
క్రికెట్ గ్రౌండ్లో బౌలర్లను గడగడలాడించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వెండితెర మీద కూడా ప్రత్యర్థి క్రికెటర్లకు తడాఖా చూపించబోతున్నారు. అదేనండి.. సచిన్ టెండూల్కర్ జీవిత కథ ఆధారంగా సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ అనే పేరుతో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సచిన్కు సూపర్ స్టార్ రజనీకాంత్ ఆశీస్సులు అందించగా, అందుకు ప్రతిగా మాస్టర్ బ్లాస్టర్ ధన్యవాదాలు తెలుపడం విశేషం.
|
మాస్టర్కు తలైవా కంగ్రాట్స్
సచిన్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది. యూట్యూబ్లో ఆ ట్రైలర్కు విశేషంగా ఆదరణ లభిస్తున్నది. ఈ సందర్భంగా సచిన్ను కంగ్రాట్స్ తెలియజేయాలని రజనీకాంత్ నిర్ణయించుకొన్నారు. అనుకున్నదే తడువుగా సచిన్ కోసం ట్విట్టర్లో ఓ సందేశాన్ని పెట్టారు. ‘మై డియర్ సచిన్.. సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్ చిత్రం విజయవంతం కావాలని కోరుకొంటున్నాను. మీకు దేవుడి దీవెనలు వెన్నంటి ఉంటాయి అని ట్వీట్ చేశారు.
|
రజనీకి సచిన్ థ్యాంక్స్
రజనీకాంత్ ట్వీట్ చేయడంపై సచిన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘థ్యాంక్యూ తలైవా. నా జీవిత కథ ఆధారంగా వస్తున్న సినిమా మీకు నచ్చుతుందని అనుకొంటున్నాను అని ట్వీట్ సచిన్ చేశాడు. తన ట్వీట్తోపాటు తమిళ ట్రైలర్, ఈ సినిమాకు పోస్టర్ను ట్యాగ్ చేశాడు.
ట్రైలర్కు మంచి స్పందన
మరాఠీ భాషలో విడుదలైన సచిన్ చిత్ర ట్రైలర్కు విశేష స్పందన లభిస్తున్నది. ఈ ట్రైలర్ బాగుందని చాలా రివ్యూలు వచ్చాయి. సోషల్ మీడియాలో సెలబ్రీటీలు పొగడ్తల వర్షం కురిపించారు. క్రికెటర్ల జీవిత ఆధారంగా ఇటీవల రూపొందిన చిత్రాల్లో సచిన్ చిత్రం మూడోవది. గతంలో అజర్, ఎంఎస్ ధోని: ది అన్టోల్డ్ స్టోరి చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టాయి.
మే 26న విడుదల
క్రికెటర్ల బయోపిక్కు సంబంధించి ఎక్కువ బడ్జెట్తో రూపొందిన రెండో చిత్రమింది. సుశాంత్ రాజ్పుత్ నటించిన ఎంఎస్ ధోని చిత్రం సచిన్ చిత్రం కంటే ఎక్కువ బడ్జెట్తో తెరకెక్కించారు. సచిన్ చిత్రంలో మాస్టర్ బ్లాస్టర్ బాల్యం నుంచి క్రికెటర్గా సంచలనాలు సృష్టించినంత వరకు పలు అంశాలను ప్రస్తావించినట్టు ట్రైలర్ ద్వారా స్పష్టమైంది. ఆ చిత్రం 2017 మే 26 తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది.