Just In
- 19 min ago
మెగా హీరోయిన్ ప్రాణాలకు ముప్పు: ఏకంగా పోలీసులకే వార్నింగ్ కాల్స్.. షాక్లో సినీ పరిశ్రమ!
- 24 min ago
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
- 50 min ago
ప్రభాస్ ‘సలార్’లో విలన్గా సౌతిండియన్ స్టార్ హీరో: ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యూటర్న్
- 1 hr ago
సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది.. అలా చేయడమే తప్పా: షకీలా సంచలన వ్యాఖ్యలు
Don't Miss!
- News
తిరుపతి అభ్యర్థిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన: వారంలో తేల్చేస్తాం: అసెంబ్లీని ముట్టడిస్తాం
- Sports
'సిడ్నీ టెస్టు తర్వాత ద్రవిడ్ సందేశం పంపించారు.. ఆయన వల్లే మేమిలా ఆడగలిగాం'
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రజినీకాంత్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల: ఇంకా అదే సమస్యతో ఇబ్బంది
సూపర్ స్టార్ రజినీకాంత్ శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థకు గురైన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆయనను సహాయక సిబ్బంది హైదరాబాద్లోని అపోలో ఆస్పతిత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన హై బీపీతో బాధ పడుతున్నట్లు నిర్ధారించారు. అప్పటి నుంచి దానికి సంబంధించిన చికిత్సను అందిస్తున్నారు. సూపర్ స్టార్ ఆస్పత్రిలో జాయిన్ అయి దాదాపు 20 గంటలు గడుస్తోన్న నేపథ్యంలో.. తాజాగా అపోలో ఆస్పత్రికి చెందిన వైద్యులు రజినీకాంత్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
తమ ఆస్పత్రిలో జాయిన్ అయినప్పటి నుంచి రజినీకాంత్ హైబీపీతో బాధ పడుతున్నారని హెల్త్ బులిటెన్లో వెల్లడించారు. ఇప్పటికీ ఆయన బీపీ కంట్రోల్ అవలేదని, అయితే ఆరోగ్యం మాత్రం నిలకడగానే ఉందని వాళ్లు పేర్కొన్నారు. అలాగే, బీపీని కంట్రోల్ చేసేందుకు సరైన చికిత్సను అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఆయనకు కొన్ని రకాల వైద్య పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. రిపోర్టులు వచ్చిన తర్వాత అన్నీ బాగుంటే రజినీకాంత్ను శనివారం సాయంత్రానికి డిశ్చార్జి చేస్తామని వైద్యులు వివరించారు. అంతేకాదు, ఆయనను చూసేందుకు ఆస్పత్రికి ఎవరూ రావొద్దని కోరారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న 'అన్నత్తే'లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం కొద్ది రోజుల క్రితం ఆయన హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ జరుగుతోన్న షెడ్యూల్లో పాల్గొంటోన్న సమయంలో రెండు రోజుల క్రితం చిత్ర యూనిట్లోని కొందరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో సినిమా షూటింగ్ను నిలిపివేశారు. అదే సమయంలో రజినీకాంత్ ఓ ఫైవ్ స్టార్ హోటల్లో స్వీయ నిర్భందంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.