Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లండన్ లో రజనీకాంత్ కు అవమానం
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తమిళ సినీ పరిశ్రమ నుంచి నేషనల్ స్టార్ గా ఎదిగిన ఆయన దేశ వ్యాప్తంగానే కాదు, తన సినిమాల ద్వారా జపాన్, చైనా లాంటి దేశాల్లోనూ అభిమానులను ఏర్పరచుకున్నారు. ఇక తమిళ అభిమానులు రజనీని దైవంగా పూజిస్తుంటారు.
తాజాగా...రజనీ అభిమానులు ఓ విషయంలో తమ హీరోకు అవమానం జరిగినట్లు ఫీలవుతున్నారు. కారణం లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రజనీ మైనపు బొమ్మ లేక పోవడమే. కొందరు అభిమానులు తమ హీరో విగ్రహాన్ని మ్యూజియంలో పెట్టాలని నిర్వాహకులను కోరిన పెద్దగా పట్టించుకోలేదట.
ఇప్పటికే భారత్ నుంచి అమితాబ్, షారుఖ్ ఖాన్, ఐశ్వర్యరాయ్ లాంటి సినీ ప్రముఖుల మైనపు బొమ్మలు మ్యూజియంలో కొలువుతీరాయి. అయితే దక్షిణాది నుంచి ఉన్న ఏకైక బిగ్ స్టార్ రజనీ ఒక్కడే ఆయన బొమ్మను కూడా పెడితే తమ హీరోకు గౌరవంగా ఉంటుందనేది అభిమానుల వాదన. మ్యూజియానికి వచ్చే సందర్శకుల్లో రజనీ అభిమానులు చాలా మందే ఉంటారు. వారి మూలంగా సదరు మ్యూజియం వారు మంచి ఆదాయం పొందుతున్నారు. ఈ అంశాన్ని మ్యూజియం వారికి గుర్తు చేస్తూ రజనీ మైనపు విగ్రహాన్ని మ్యూజియంలో పెట్టించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నా లండన్ లోని రజనీ అభిమానులు.