రోడ్డు ప్రమాదంలో గాయపడిన 'త్రీ ఇడియట్స్' డైరక్టర్
ముంబై: మున్నాభాయ్ ఎంబీబిఎస్, లగేరహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, పీకే వంటి చిత్రాలు అందించిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్కుమార్ హిరానీ మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ముంబయిలో బైక్పై వెళుతుండగా ఆయన అదుపుతప్పి పడిపోయారు. దీంతో ఆయన్ని మంబయిలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయని, ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

హిరాని... తన ఎంప్లాయిస్ లో ఒకరు..రాయిల్ ఎన్ ఫీల్డ్ బైక్ కొత్తది కొనుక్కోవటంతో దాన్ని నడపాలని ఉత్సాహపడ్డారు. అప్పటికీ ఆయన స్లోగానే నడిపారు. అయితే ఆయన దాని బరువుని మేనేజ్ చెయ్యలేక పడిపోయారు. స్లోగా వెళ్లటంతో పెద్దగా ప్రమాదం జరగలేదు. గడ్డం దగ్గర చిన్న గాయాలు అయ్యాయి.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
More from Filmibeat
munna bhai pk rajkumar hirani mumbai bollywood మున్నాభాయ్ లగేరహో త్రీ ఇడియట్స్ పీకే రాజ్ కుమార్ హిరానీ బాలీవుడ్


Click it and Unblock the Notifications











