Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నిన్న జూ ఎన్టీఆర్, నేడు రామ్ చరణ్ మీడియా పై గరం గరం...!?
జూ ఎన్టీఆర్ వివాహమాడబోయే లక్ష్మీప్రణతి జాతకం బాగుండకపోవడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని ఛానల్స్ లో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఆ ఛానల్ కి సంబంధించిన వారిని జూ ఎన్టీఆర్ పిలిపించి వారి మీద సీరియస్ అయ్యాడన్న విషయం కూడా తెలిసిందే.
కాగా చరణ్ కూడా మీడియాకి క్లాస్ పీకాడని సమాచారం. నిజానిజాలు తెలుసుకోకుండా సంచలనాలకోసం తప్పుడు వార్తల్ని ప్రచారం చేయడం దురదృష్టకరమని ఇటీవలే ఓ కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేశాడు. సంచలనాలకోసం కాకుండా, ప్రజలకు మేలు చేసే వార్తల్ని ప్రసారం చేయాలనీ, తద్వారా వీక్షకుల మెప్పు పొందాలని చరణ్ అభిలషించాడు. లోకల్ టీవీ మీడియాలో వివిధ విభాగాలకు అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చరణ్, మీడియాపై డైరెక్ట్ గా విమర్శనాస్త్రాలు వదిలాడు.
చరణ్ ఇంతగా మీడియాపై ఆవేదన వ్యక్తం చేయడం వెనుక, గతంలో తనకూ, 'చిరుత" సినిమా హీరోయిన్ కీ పెళ్ళయిపోయిదంటూ అప్పట్లో గాసిప్స్ రావడం ఓ కారణమైతే, ఇటీవలే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై జీవిత, రాజశేఖర్ చేస్తోన్న ఆరోపణలు, వాటికి మీడియా ఇస్తోన్న ప్రాధాన్యత కూడా మరో కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరేం చెబితే దాన్ని ప్రసారం చేయడం కాకుండా, వాస్తవాల్ని తెలుసుకుని, ఆ వార్తల్ని ప్రసారం చేస్తే మీడియ అంటే ప్రజలకు గౌరవం పెరుగుతుందని చరణ్ వ్యాఖ్యానించడం, దానికి అదే కార్యక్రమంలో హాజరైన మీడియా ప్రతినిథులు అభినందనలు తెలియజేయడం గమనార్హం.