Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ పనేదో ఇంట్లోనూ చెయ్యచ్చుగా రామ్ చరణ్
హైదరాబాద్ : రామ్ చరణ్ తాజా చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' లో కథ ప్రకారం విడిపోయిన తండ్రిని,బాబాయ్ లను కలిపే భాధ్యత తీసుకుంటాడట. అదే పాత్ర తీరును ఇంట్లోనూ తీసుకోవచ్చుగా అంటున్నారు. ఆయన తండ్రి చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్ సిద్దాంతాలు పరంగా విడిపోయారని, వారిని ఏకం చేసే భాధ్యతను తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు. తెరమీద అయినంత ఈజీగా నిజ జీవితంలో కష్టం అయినా రామ్ చరణ్ తలుచుకుంటే అదెంత అంటున్నారు.
ఇక ఈ చిత్రం కథ గురించి నిర్మాత మాట్లాడుతూ... సమాజం బాగుండాలంటే కుటుంబాలు బాగుండాలి. కుటుంబం బాగుండాలంటే అందులోని బంధాలూ బలంగా ఉండాలి. ఆ బంధానికి నమ్మకమే పునాది. ఆ నమ్మకాన్ని నిలబెట్టి, తన కుటుంబంలో ఆనందాల దీపాల్ని వెలిగించడానికి ఓ యువకుడు చేసిన ప్రయత్నం... 'గోవిందుడు అందరివాడేలే' అన్నారు. రామ్చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రమిది. కాజల్ హీరోయిన్. కృష్ణవంశీ దర్శకుడు. బండ్లగణేష్ నిర్మాత. శ్రీకాంత్, రాజ్కిరణ్, కామ్నా జెఠ్మలానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
చిత్రం షూటింగ్ ప్రస్తుతం రాజధానిలో జరుగుతోంది. నగర శివార్లలో వేసిన ఓ సెట్లో రామ్చరణ్పై ఫైటింగ్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. వీటికి రామ్ - లక్ష్మణ్ నేతృత్వం వహిస్తున్నారు. రాజ్కిరణ్, మిత్ర, కాశీవిశ్వనాథ్ తదితర తారాగణం కూడా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ''కుటుంబ బంధాలకు పెద్దపీట వేసిన చిత్రమిది. ఇంటిల్లిపాదికీ నచ్చేలా తీర్చిదిద్దుతున్నాం. రామ్చరణ్ కెరీర్లో ఇదో మైలురాయిలా నిలుస్తుంది'' అని చెబుతున్నారు.
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే పాటని ఈ చిత్రంలో రీమిక్స్ చేస్తున్నట్టు సమాచారం. రామ్చరణ్ తండ్రి పాత్రలో ప్రముఖ నటుడు కనిపించబోతున్నారు. ఆయనెవరేది త్వరలో తెలుస్తుంది. ఈ చిత్రానికి యువన్శంకర్రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.