Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చిరు పుట్టిన రోజున చరణ్-కొరటాల మూవీ
హైదరాబాద్ : ఇటీవల హీరో ప్రభాస్ తో 'మిర్చి' సినిమాను తీసి మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు కొరటాల శివ, నెక్ట్స్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. వరుసగా భారీ చిత్రాలను నిర్మిస్తూ టాలీవుడ్ లో అగ్రనిర్మాతగా రాణిస్తున్న బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.
తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రం ఆగస్టు 22న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈచిత్రం షూటింగ్ జులై నెలలోనే ప్రారంభం కావాల్సి ఉండగా ఆగస్టు 22కు వాయిదా పడింది. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడం గమనార్హం.
ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ స్క్రిప్టును ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడు. లో కథ ..పూర్తిగా బ్రదర్ సెంటిమెంట్ మీద బేస్ చేసుకుని నడుస్తుందని సమాచారం. సెంటిమెంట్,యాక్షన్ కలిసి ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. క్యాధరిన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే మరో హీరోయిన్ ఫైనల్ కానుంది.
మిర్చి చిత్రంలో ప్రభాస్ ను అద్భుతంగా ప్రజెంట్ చేసిన కొరటాల శివ....రామ్ చరణ్ను ఆయన గత సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ లుక్, డిఫరెంట్ కథాంశంతో ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్కు భిన్నంగా ఈ సినిమా ఉండనుంది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం 'ఎవడు' పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.