Don't Miss!
- News రైతు రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? హరీష్ కు రేవంత్ రెడ్డి ప్రతిసవాల్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అది రామ్ చరణ్ వదులుకున్న బంగారమేనా?
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓకే బంగారం' చిత్రం విడుదలై మంచి రొమాంటిక్ మూవీగా పేరు తెచ్చుకుంది. చాలా కాలం తర్వాత మణితర్నం ఈ సినిమాతో విజయం అందుకున్నారు. మమ్ముటి తనయుడు దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ ఈ చిత్రంలో జంటగా నటించారు. లివ్ ఇన్ రిలేషన్ షిప్, లవ్ అంశాలను బేస్ చేసుకుని ఎంతో బ్యూటిఫుల్ గా ఈ లవ్ స్టోరీని తెరకెక్కించాడు మణిరత్నం. యువతను ఈచిత్రం ఎంతగానో ఆకట్టుకుంటోంది.
వాస్తవానికి ఈ చిత్రం...రామ్ చరణ్తో చేయాల్సింది అంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు. అయితే రామ్ చరణ్ ఈ సినిమా చేయడానికి నో చెప్పడంతో మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ ఈ సినిమా చేసే అవకాశం దక్కిందని అంటున్నారు. గతంలో ఓ సారి మణిరత్నం, సుహాసిని స్వయంగా వచ్చి చిరంజీవి, రామ్ చరణ్ లను కలిసారు.
అప్పట్లో మణిరత్నం దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అప్పటికే ‘ఆరెంజ్' లవ్ స్టోరీతో దెబ్బతిని ఉన్న రామ్ చరణ్ మాస్ ఎలిమెంట్స్ లేకుండా సినిమా చేయడానికి సాహసం చేయలేక పోయాడు. అందుకే మణిరత్నం చెప్పిన స్టోరీ (ఇప్పటి ఓకే బంగారం)ని చేయడానికి నిరాకరించాడట. చిరంజీవి సూచన మేరకే రామ్ చరణ్ ఈ స్టోరీని తిరస్కరించాడని టాక్.