Don't Miss!
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- News Viral Video: రాజకీయ దిగ్గజాల కాళ్లు మొక్కిన టీడీపీ అభ్యర్ధి నిమ్మల..!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మరో వివాదాస్పద కథతో వర్మ చిత్రం.. క్రేజీగా టైటిల్ ఫస్ట్ లుక్
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో దూసుకెళ్తున్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్కు తెర లేపారు. ఓ పక్క లక్ష్మీస్ ఎన్టీఆర్ వివాదంలో కొనసాగుతుండగానే తమిళ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదమైన జయలలిత, శశికళ అంశాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. శశికళ బయోపిక్ను తీస్తున్నట్టు వర్మ అనౌన్స్ చేయడం దక్షిణాదిలో చర్చనీయాంశమైంది.
మగజాతిపై వివక్ష, జైళ్లు, మన్నార్గుడి గ్యాంగ్ నేపథ్యంగా శశికళ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్టు రాంగోపాల్ వర్మ ప్రకటించారు. ఈ మేరకు ఆ సినిమాకు సంబంధించిన టైటిల్ ఫస్ట్లుక్ను రిలీజ్ చేశారు.
శశికళ బయోపిక్ను ఏ అంశాల ఆధారంగా, ఏ కోణంలో రూపొందిస్తారు అనే విషయంపై రాజకీయ, సినీ విమర్శకుల్లో చర్చ మొదలైంది. ఈ చిత్రాన్ని కూడా వివాదానికి కేంద్ర బిందువుగా మలిచే అవకాశం లేకపోలేదనే వాదన వినిపిస్తున్నది.
ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం ఇప్పటికే రూ.5 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. గత దశాబ్దకాలంలో రాంగోపాల వర్మ రూపొందించిన చిత్రానికి ఈ రేంజ్లో కలెక్షన్లు రావడం ఇదే మొదటిసారి.