Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
రామ్ గోపాల్ వర్మని ఆ అవార్డు వరించింది...
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కి తాజాగా గోల్డెన్ కేలా అవార్డుని సొంతం చేసుకున్నారు. అందులో ఆయనకు విచిత్రమైన విభాగంలో పురస్కారం దక్కింది. 'బస్కీజియే బహుత్ హోగయా' (ఎక్కువైంది.. ఇక ఆపు) అవార్డును ఇచ్చారు.ఇక గోల్డెన్ కేలా అవార్డులు బాలీవుడ్ లో వచ్చిన పేలవమైన చిత్రాలుకు ప్రకటిస్తూంటారు. ఉత్తమ చెత్త చిత్రం, ఉత్తమ చెత్త నటుడు,నటి,దర్శకుడు ఇలా ప్రతీ విభాగంలోనూ అవార్డులు అందిస్తారు. వీటిని గత మూడు సంవత్సరాలుగా ప్రకటిస్తున్నారు.
ఈ సంవత్సరం మూడో గోల్డెన్ కేలా అవార్డుల్ని ప్రకటించారు. అందులో పేలవమైన నటుడిగా షారుఖ్ ఖాన్ (మై నేమ్ ఈజ్ ఖాన్) అవార్డు సొంతం చేసుకున్నారు. 'మై నేమ్ ఈజ్ ఖాన్' సినిమా ఉత్తమ చెత్త చిత్రంగా ప్రధమ స్ధానంలో నిలిచి అవార్డుని సొంతం చేసుకుంది. అలాగే స్వీయనిర్మాణ సంస్థ నుంచి వచ్చిన 'అయేషా' చిత్రంలోని పేలవమైన నటనకుగానూ సోనమ్ కపూర్ చెత్తనటిగా ఎంపికైంది. అలాగే గుజారిష్ డైరక్టర్ సంజయ్ లీలా భన్సాలీ కి వరస్ట్ డైరక్టర్ అవార్డ్ సాధించారు.
అలాగే గుజారిష్ చిత్రం బ్లాక్ అవార్డు అందుకుంది. ఎందుకంటే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ బాగా చేసినందుకు అని ప్రకటించారు. అలాగే వరస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డుని హౌస్ ఫుల్ చిత్రానికి గాను అర్జున్ రామ్ పాల్ ని వరించింది. కైట్స్ చిత్రంలో నటనకుగాను కంగనా రౌనత్ కి వరస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్ అవార్డు వరించింది.