Don't Miss!
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఎన్టీఆర్ను గొప్పవాడిని చేసేంది మేమే. ఆయన కొడుకులు కాదు.. రాంగోపాల్ వర్మ
రాంగోపాల్ వర్మ నటించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం రిలీజ్ ముందే కాకుండా విడుదల తర్వాత కూడా వివాదాల్లో కొనసాగుతున్నది. ఏపీలో ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా హైకోర్టు స్టే ఇవ్వడంతో చిత్ర రిలీజ్ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రాంగోపాల్ వర్మ తనలోని అసంతృప్తిని వెళ్లగక్కాడు. సినిమాను అడ్డుకొన్నంత మాత్రాన నిజం బయటకు రాకుండా ఉండదని ఆయన అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
గొప్పగా చెప్పాలనుకొన్నాను
ఎలాంటి కథనైనా గొప్పగా చెప్పాలనుకొంటాను. అందులో భాగంగానే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తీశాను. వివాదాల ద్వారా లబ్ది పొందాలని మాత్రం సినిమా చేయలేదు. ఒకరికి నష్టం చేయడానికి మాత్రం నేను లక్ష్మీస్ ఎన్టీఆర్ రూపొందించలేదు అని వర్మ అన్నారు.
రాజకీయాలంటే నచ్చవు
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను రూపొందించినంత మాత్రాన రాజకీయాల్లోకి వెళ్తాననుకోవడం తప్పు. నాకు రాజకీయాలంటే పడవు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన నాకు లేదు. నాకు రాదు. నేను సినిమాలు తీయడానికి ఉంటాను తప్ప మరో బిజినెస్ గానీ, వ్యాపకంగానీ నాకు లేదు అని వర్మ అన్నారు.
ఎన్టీఆర్ను అలా చేసింది మేమే
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసిన తర్వాత ఎన్టీఆర్ పెద్ద కొడుకు అని వచ్చిన కామెంట్పై వర్మ స్పందించాడు. అలా నన్ను అనడం చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ను మహానుభావువుడిని చేసింది మేమే. వాళ్ల కొడుకులు కాదు. టికెట్లు కొనుక్కొని సినిమాలు చూడటం వల్లే ఎన్టీఆర్ గొప్ప నటుడు అయ్యారు అని వర్మ కామెంట్ చేశాడు.
రిలీజ్ కాకుండా అడ్డుకోవడంపై
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ కాకుండా అడ్డుకోవడం చాలా బాధగా ఉంది. ఇప్పుడు అడ్డుకొన్నప్పటికీ.. నిజం బయటకు రాకుండా ఆపలేరు. ఈ సినిమా ద్వారా తెలుగుదేశం పార్టీకి లేదా చంద్రబాబుకు నష్టం వస్తుందా? మరోపార్టీకి మేలు చేకూరుతుందా? అనే విషయాలను నేను నమ్మను. పట్టించుకోను అని వర్మ కామెంట్ చేశారు.