Just In
- 25 min ago
మరో బిగ్ బడ్జెట్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ
- 27 min ago
‘ఆచార్య’ టీజర్ రిలీజ్కు డేట్ ఫిక్స్: స్పెషల్ డేను లాక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి
- 42 min ago
దీప్తి సునయన అలాంటిది కాదు.. నోయల్ సెన్సేషనల్ కామెంట్స్
- 53 min ago
పవన్ కల్యాణ్ పేరిట సరికొత్త రికార్డు: ఏకంగా 90 గంటల నుంచి హవాను చూపిస్తూ సత్తా!
Don't Miss!
- Automobiles
ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో చేరిన 4 కొత్త కార్లు.. ఒక్కక్కటి 2 కోట్లకు పైమాటే
- News
చంద్రబాబు పిల్లర్లు కదులుతున్నాయ్ ; దేవినేని ఉమ ఒక లోఫర్ : ధ్వజమెత్తిన వల్లభనేని వంశీ
- Lifestyle
ఈ హార్మోన్ల సమస్య ఉన్న మహిళలు బరువు తగ్గడం చాలా కష్టం...!
- Finance
Budget 2021: 10 ఏళ్లలో బడ్జెట్కు ముందు సూచీలు ఇలా, ఇన్వెస్టర్లకు హెచ్చరిక!
- Sports
చరిత్ర సృష్టించిన భారత్.. బ్రిస్బేన్ టెస్టులో ఘన విజయం!! టెస్ట్ సిరీస్ టీమిండియాదే!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ డైరెక్టర్లకు సీక్రెట్ పార్టీ ఇచ్చిన హీరో రామ్.. సినిమాలు చేయకున్నా ఇద్దరికి ఆహ్వానం
కెరీర్ ఆరంభంలో పలు విజయాలు అందుకుని చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకున్నాడు యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్. మధ్యలో కొన్ని పరాజయాల కారణంగా ఇబ్బందులు పడ్డాడు. ఈ నేపథ్ంయలో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడతను. అంతేకాదు, ఈ సినిమాతో తన కెరీర్లోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సారి ఎలాగైనా కొట్టాలన్న కసితో తన లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలో మార్పులు చేసుకున్నాడు. దీంతో సక్సెస్ అయ్యాడు.
ఈ ఉత్సాహంతోనే ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో 'రెడ్' అనే సినిమా చేస్తున్నాడు రామ్ పోతినేని. స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ చిత్రం ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే, ఇంతలో కరోనా వైరస్ ప్రభావంతో థియేటర్లు మూతపడడంతో ఈ మూవీ విడుదల వాయిదా పడిపోయింది. దీంతో ఈ సినిమా హక్కుల కోసం పలు ఓటీటీ సంస్థలు ఎగబడ్డాయి. కానీ, దీన్ని థియేటర్లలోనే విడుదల చేయాలని రామ్ పట్టుదలతో ఉన్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇదిలా ఉండగా, 'రెడ్' తర్వాత తాను నటించబోయే సినిమాను ఇప్పటి వరకూ ప్రకటించలేదు రామ్. ఈ నేపథ్యంలో టాలీవుడ్లోని కొందరు దర్శకులకు అతడు సీక్రెట్ పార్టీ ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది. దీనికి రామ్తో 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ', 'రెడ్' వంటి చిత్రాలు చేసిన కిశోర్ తిరుమల.. 'కందిరీగ' చేసిన సంతోష్ శ్రీనివాస్.. 'పండగ చేస్కో' తీసిన గోపీచంద్ మలినేని హాజరయ్యారు. వీరితో పాటు అతడితో ఒక్క సినిమాను కూడా తెరకెక్కించని అనిల్ రావిపూడి, వెంకీ కుడుమల కూడా వచ్చారు. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.