Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఇక బుల్లి తెరపై కంటిన్యూగా రంభ చిందులు
హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రంభ త్వరలో ఈటీవీ ఛానెల్ రెగ్యులర్ గా కనిపించటానికి ఎగ్రిమెంట్ కుదుర్చుకుందని సమాచారం. ఈటీవీలో పాపులర్ అయిన ఢీ పోగ్రామ్ కి ఆమె జడ్జిగా రానుంది. అయితే ఈ డీ పోగ్రామ్ లేడీస్ స్పెషల్ గా రూపొందిస్తున్నారు. ఏప్రియల్ మొదటి వారం నుంచి ప్రతీ గురువారం రాత్రి 9:30 నుంచి 10:30 వరకూ ఈ పోగ్రాం వస్తుందని చెప్తున్నారు. అలాగే ఈ పోగ్రామ్ లో యాంకర్ గా ఉదయభాను వ్యవహిస్తుంది. బ్రాండ్ అంబాసిడర్ గా శ్రియను అడుగుతున్నారు. మొత్తానికి ఈ పోగ్రామ్ కి పూర్తి స్ధాయి సినిమా హంగులు అద్ది రేటింగ్ లు పెంచే ప్రయత్నంలో ఉంది యాజమాన్యం. ఇక రంభ వివాహం కూడా ఏప్రియల్ ఎనిమిదిన తిరుపతి లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక రంభను ఈ పోగ్రామ్ కి తీసుకోవటానికి కారణం గ్లామర్ అనేదే కాక ఆమె డాన్స్ ప్రావీణ్యం కూడా అని తెలుస్తోంది. అంటే పోగ్రామ్ లో రంభ నృత్యాలు స్పెషల్ గా ఉంటాయన్న మాట.