Don't Miss!
- News
ఐప్యాక్ సర్వేతో రఘురామ రిజల్ట్స్ మ్యాచ్ ? పవన్-లోకేష్ ఎఫెక్ట్ కీలకం ! ముందస్తు ముహుర్తమిదే !
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Sports
అందుకే పృథ్వీ షా, చాహల్ను జట్టులోకి తీసుకోలేదు: హార్దిక్ పాండ్యా
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Lifestyle
ఎదుటివారి సంతోషం కోసం మిమ్మల్ని మీరు కోల్పోవద్దు.. ఈ చిట్కాలు మీకోసమే
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
మాధురి దీక్షిత్ బాటలో రంభ
వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన తారలు...పెళ్లి త్వరాత సినిమాలకు దూరం అవుతున్నారు. వీరిలో కొందరు శాశ్వతంగా తెరమరుగైఃపోతే, మరి కొందరు మాత్రం మళ్లీ సినిమాల్లోకి వచ్చి తమ సత్తా చాటుతున్నారు. టాలీవుడ్ లో ఇలాంటివి కనిపించవు కానీ, బాలీవుడ్ లో మాత్రం ఈ పోకడలు ఎక్కువే. ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ విషయానికొస్తే...ఓ రిచ్ డాక్టర్ను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లి పోయిన మాధురి మళ్లీ బాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. శిల్పాశెట్టి కూడా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమై దోస్తానా సినిమాలో ఐటం గర్ల్ గా రీఎంట్రీ ఇచ్చింది.
వీరి బాటాలోనే తెలుగు హీరోయిన్ రంభ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధం అవుతోంది. రంభ చేసే ఐటం సాంగులకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో చాలా మంది దర్శక నిర్మాతలు ఇప్పటికే ఆమె వెంట పడుతున్నారు. అయితే ఎట్టకేలకు వారి శ్రమ ఫలించినట్లే కనిపిస్తోంది. తిరిగి సినిమాల్లో నటించడానికి రంభ సుమఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
కెనడాలో సెటిలైన ప్రవాస భారతీయుడు, వ్యాపారి అయిన ఇంద్రకుమార్ ను రంభ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరికి ఓ పాప జన్మించింది. ప్రస్తుతం చిన్నారి ఆలనా పాలనలో రంభ బిజీగా ఉంది.