Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాలకృష్ణతో సినిమా ఆగిపోవటానికి కారణం నేనే అంటున్న దర్శకుడు
నిజానికి బాలయ్య కోసం సిద్దం చేసుకున్న కథ ఇది. 'భీష్మ" పేరుతో ప్రాజెక్ట్ సైతం అనౌన్స్ చేసాం. అయితే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చకపోవడానికి కారణం నేనే. నా మూడో సినిమాకే బాలకృష్ణ వంటి టాప్స్టార్ను డైరెక్ట్ చేయగలనా అనే భయంతో నేనే డ్రాప్ అయిపోయాను అంటున్నారు రమేష్ వర్మ. ఆయన తన తాజా చిత్రం వీర గురించి మాట్లాడుతూ..అలాగే.. అదే కథను స్వల్ప మార్పులుచేర్పులతో రవితేజతో చేసాను. 'భీష్మ" టైటిల్ 'వీర"గా మార్చాను అని చెప్పుకొచ్చారు. అప్పట్లో బాలకృష్ణ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ 'భీష్మ"టైటిల్ ఎనౌన్స్ చేసి ఆపుచేసారు. అంతకుముందు అదే బ్యానర్ లో రమేష్ వర్మ చిన్న హీరోలతో రైడ్ అనే హిట్ చిత్రం ఇచ్చారు. దాంతో బెల్లంకొండ ఈ ఆఫర్ ఇచ్చారు. కానీ సినిమా ప్రారంభం కాకముందే ఆగిపోయింది. ఇక ఈ కథను విన్న రవితేజ ఆసక్తి చూపించి పూర్తి చేయటంతో సినిమా తెరకెక్కింది. రవితేజ హీరోగా శాన్వి ప్రొడక్షన్స్ పతాకంపై గణేశ్ ఇందుకూరి నిర్మించిన 'వీర' చిత్రానికి ఆయన దర్శకుడు. ఈ నెల 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.