Don't Miss!
- News వాళ్ళను తిడుతూనే.. వైఎస్ జగన్, భారతి వద్ద కోట్లలో వైఎస్ షర్మిలమ్మ అప్పులచిట్టా ఇదే!!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
హీరోయిన్ తో చర్చలు విఫలం...వివాదం మొదటికే
బెంగళూరు : 'నీర్దోసె' సినిమా చిత్రీకరణ వివాదాన్ని పరిష్కరించేందుకు కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈనెల 25న మరోసారి సమావేశం కావాలని మండలి అధ్యక్షుడు హెచ్.డి.గంగరాజు తీర్మానించారు. చిత్రీకరణ అర్ధంతరంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న రమ్య లోక్సభ సభ్యురాలిగా ఎన్నిక కావడంతో చిత్రీకరణలో పాల్గొనడం సాధ్యంకాలేదు. ఈ విషయమే వివాదంగా మారింది. సినిమా కోసం ఇప్పటికే రూ. నాలుగు కోట్ల మేర వ్యయం చేశానని నిర్మాత సుధీంద్ర చెబుతున్నారు. షూటింగ్ ఆలస్యమైయ్యేకొద్దీ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వాపోయారు.
ఇదే విషయాన్ని మండలికి ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో బుధవారం వాణిజ్య మండలి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. నియోజకవర్గంలో పర్యటిస్తున్న నేపథ్యంలో సమావేశానికి హాజరుకాలేనని రమ్య అసహాయతను వ్యక్తం చేశారు. వచ్చే జూన్లో పొల్గొనేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని రమ్య ఫోన్ ద్వారా తెలిపినట్లు సమాచారం. అన్ని నెలల పాటు వేచి ఉండడం అసాధ్యమని ఈనెల, వచ్చేనెలలో పది రోజుల చొప్పున కాల్షీట్ ఇస్తే చాలని నిర్మాత కోరినా రమ్య నిరాకరించారని తెలిసింది. దీంతో 25న సమావేశాన్ని నిర్వహించాలని తీర్మానించారు. ఆనాటి సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని రమ్యను కోరినట్లు మండలి అధ్యక్షుడు గంగరాజు తెలిపారు.
రముఖ కన్నడ నటి రమ్య స్పందన ఇటీవల ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ సందట్లో పడి ఈ భామ సినిమాలను నిర్లక్ష్యం చేస్తోందట. దీనికి సంబంధించి 'నీర్ దోసె' హీరో జగ్గేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జగ్గేష్ కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. జగ్గేష్ బీజేపీలో ఉన్నారు. రమ్య కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. మాండ్యా నియోజకవర్గంలో ఇటీవల లోక్సభ బైపోల్లో గెలిచి ఎంపీగా పార్లమెంట్లో ప్రవేశించారు. జగ్గేష్ మాట్లాడుతూ "ఇది అనైతికం. సినిమా పూర్తి కావడానికి ఆమె సహకరించకపోవడం దారుణం. ఆమె పార్లమెంట్ సభ్యురాలు అయితే కావచ్చు.
కానీ అంతకు ముందు ఆమె నటి అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇవాళ ఆమె ఈ స్థాయిలో ఉండటానికి కారణం సినిమానే అనే విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తే ఎలా? 'నీర్ దోసె' దాదాపుగా 60 శాతం పూర్తయింది. నిర్మాత దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంత మొత్తాన్ని ఇప్పుడు ఎవరిస్తారు? ఆ నష్టాన్ని రమ్య భరిస్తుందా?'' అని ప్రశ్నించారు. రమ్య ఈ విషయం గురించి ఇప్పటిదాకా ఏమీ స్పందించలేదు. కానీ ఆమె సన్నిహితుల అభిప్రాయం మేరకు రమ్య రాబోయే ఎలక్షన్స్ మీద దృష్టి పెట్టిందట. ఇప్పట్లో సినిమాలకు కాల్షీట్ కేటాయించే పరిస్థితుల్లో లేదట. కానీ జగ్గేష్ ఏ విషయాన్నీ నిగ్గు తేల్చందే వదిలిపెట్టేలా లేరు. ఈ సమస్యను రమ్య ఎలా అధిగమిస్తుందో వేచిచూడాల్సిందే.