Don't Miss!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హాలీవుడ్ చిత్రం కమిటైన తెలుగు స్టార్ హీరో
తెలుగు పరిశ్రమనే ఈదలేకుంటే ఇక హాలీవుడ్, బాలీవుడ్ సంగతి ఏమిటంటారా...అయితే ట్రైల్ వెయ్యటంలో తప్పేముంది అనుకున్నాడో ఏమో గాని దగ్గుపాటి రానా తాజాగా ఓ హాలీవుడ్ చిత్రం చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ మేరకు ట్రైల్ షూట్ కూడా జరిగింది. ఆదిత్య బట్టాచార్య అనే డైరక్ట్రర్ దీనిని డైరక్ట్ చేయనున్నాడు. ఆదిత్య బట్టాచార్య గతంలో అమీర్ ఖాన్ తో రాఖ్ అనే చిత్రం రూపొందించారు.
బసు బట్టాచార్య కుమారుడైన ఆదిత్య ఆ తర్వాత కొన్ని యుఎస్ ప్రాజెక్టులలో బిజీ అయ్యారు. ఆ తర్వాత సెన్సో యునీకో అనే ఇటాలియన్ చిత్రం రూపొందించారు. ఇక దమ్ మారో దమ్ చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రానా ని చూసి ఎంపిక చేసుకన్నాడని, ట్రైల్ షూట్ కూడ రహస్యంగా హైదరాబాద్ లోనే జరిగిందని చెప్తున్నారు. ఇక రానా, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రెడీ అయిన నేనూ ..నా రాక్షసి చిత్రం త్వరలో రిలీజు కానుంది.