twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలిని తలదన్నేలా మహాభారతం సినిమా.. బడ్జెట్ 1000 కోట్లు.. 100 భాషల్లో..

    భారతీయ సినీ పరిశ్రమకు మణిహారంగా నిలిచింది బాహుబలి సినిమా. బాహుబలి చిత్రాన్ని తలదన్నే విధంగా దక్షిణాదిలో రాండమూజమ్ అనే మరో సినిమా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కడానికి సిద్ధమవుతున్నది.

    By Rajababu
    |

    భారతీయ సినీ పరిశ్రమకు మణిహారంగా నిలిచింది బాహుబలి సినిమా. బాహుబలి చిత్రాన్ని తలదన్నే విధంగా దక్షిణాదిలో రాండమూజమ్ అనే మరో సినిమా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కడానికి సిద్ధమవుతున్నది. ఈ చిత్రం బడ్జెట్ అక్షరాల రూ.1000 కోట్లు. భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మొట్టమొదటి చిత్రం ఇదే కావడం గమనార్హం. ఈ సినిమాను మలయాళ చిత్ర దర్శకుడు శ్రీకుమార్ మీనన్ రూపొందిస్తున్నారు. యూఏఈకి చెందిన ఎన్నారై పారిశ్రామిక వేత్త బీఆర్ శెట్టి 1000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు.

    వచ్చే ఏడాది..

    వచ్చే ఏడాది..

    రాండామూజమ్ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో సెట్‌పైకి వెళ్లనున్నది. ఈ చిత్రం రెండు భాగాలుగా వెండితెరపైకి రానున్నది. తొలిభాగానని 2020లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిను మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఆంగ్ల భాషల్లో తెరకెక్కించనున్నారు. ఆ తర్వాత భారతీయ భాషల్లోకి, విదేశీ భాషల్లోకి డబ్బింగ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

    మహాభారతం కథ వెండితెరపైకి..

    మహాభారతం కథ వెండితెరపైకి..

    మహాభారతం కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రముఖ రచయిత ఎంటీ వాసుదేవన్ నాయర్ రాసిన రాండామూజమ్ నవల ఆధారం. మహాభారతంలో భీముని పాత్ర కోణంలోనూ, పాండవుల కథ నేపథ్యంగా సాగుతుందని చిత్ర నిర్వాహకులు వెల్లడించారు. ఈ చిత్రానికి హాలీవుడ్ నిపుణులు, ఇతర దేశాల టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని గ్లోబల్ చిత్రంగా రూపొందిస్తున్నారు.

    మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి

    మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి

    ప్రధాని మోదీ ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నామని యూఏఈ ఎక్స్సేంజ్ చైర్మన్, ఎన్‌ఎంసీ హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు షెట్టి తెలిపారు.ఈ చిత్రం ప్రపంచ సినిమా చరిత్రలోనే మైలురాయిగా నిలుస్తుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

    100 భాషల్లోకి..

    100 భాషల్లోకి..

    దాదాపు 100కు పైగా భాషల్లో ఈ సినిమాను డబ్బింగ్ చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నామని ఆయన చెప్పారు. దాదాపు మూడు వందల కోట్ల మంది చూసే లక్ష్యంగా ఈ సినిమాను రూపొందిస్తున్నామని శెట్టి చెప్పారు. ఈ చిత్రానికి వాసుదేవ నాయర్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. వాసుదేవ నాయర్‌ స్క్రీన్ ప్లే అందించిన పలు చిత్రాలు గతంలో జాతీయ స్థాయి అవార్డులు అందుకొన్నాయి.

    మోహన్ లాల్ కథానాయకుడిగా..

    మోహన్ లాల్ కథానాయకుడిగా..

    గతేడాది ఈ చిత్రంలో నటించాలని ఉందన్న ఆశాభావాన్ని మాలీవుడ్ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 2014లోనే ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, విక్రమ్, నాగార్జున తదితరులతో తీయనున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. అయితే ఈ చిత్రంలో తాను నటించడం లేదని అమితాబ్ బచ్చన్ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపారు.

    మహాభారతంపైన రాజమౌళి ఆసక్తి..

    మహాభారతంపైన రాజమౌళి ఆసక్తి..

    మరో ఆసక్తికరమైన విషయమేమింటంటే బాహుబలితో దక్షిణాది సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి మహాభారతాన్ని తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్‌తో చర్చించినట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.

    English summary
    The epic mythology Mahabharata will now be made as a feature film with a whopping budget of Rs 1000 crore. A UAE-based Indian businessman BR Shetty is investing Rs 1,000 crore to produce India's biggest-ever motion picture, The Mahabharata, which will be helmed by ad-filmmaker Shrikumar Menon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X