'బాహుబలి' కి బలై పోయాం అంటూ ఆవేదన...ఫిల్మ్ ఛాంబర్ లో వివాదం
బెంగుళూరు: ఇప్పుడు ఎక్కడ చూసినా 'బాహుబలి' హంగామానే. ఈ 'బాహుబలి' కు తెలుగు,తమిళ, కన్నడ, మళయాళ, హిందీ పరిశ్రమల సిని జనం ఆహ్వానం పలుకుతున్నారు. అయితే కన్నడ పరిశ్రమలో ఈ మధ్య కాలంలో రిలీజై హిట్టైన రంగి తరంగ దర్శక,నిర్మాతలు మాత్రం గోలెత్తిపోతున్నారు. అవును..రంగి తరంగ చిత్రం ఈ 'బాహుబలి' కు ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ధియోటర్స్ ప్లాబ్లం ఎదుర్కోబోతోంది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
'బాహుబలి' చిత్రం రేపు రిలీజ్ అవుతూండటంతో అక్కడ ఆల్రెడీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న రంగి తరంగ చిత్రాన్ని తొలిగిస్తున్నారు. చాలా చోట్లా మల్టిప్లెక్స్ లు, థియోటర్లు లలో ఈ సినిమాని తీసేస్తున్నారు.
ఈ విషయమై మా కన్నడ ఫిల్మ్ బీట్ ప్రతినిధితో రంగతి తరంగ దర్సకుడు అనూప్ బండారి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... "మేము బాహుబలి రిలీజ్ కు వ్యతిరేకం కాదు. కాని ఈ విషయం మమ్మల్ని చాలా నిరాశకు గురి చేస్తోంది. ఓ మంచి కన్నడ చిత్రం చాలా చోట్ల నుంచి తొలిగించాల్సి రావటం భాధాకరం " అని అన్నారు.
అనూప్ కంటిన్యూ చేస్తూ.... మా సినిమా వీకెండ్ లలో హౌస్ ఫుల్స్ రన్ అవుతోంది. అన్ని మల్టిప్లెక్స్ లలో తొలిగిస్తున్నారు అని భాధగా చెప్పుకొచ్చారు.
నిర్మాత హెచ్ కె ప్రకాష్, డిస్ట్రిబ్యూటర్ జయన్న ఇప్పటికే ఈ విషయమై ఫిల్మ్ ఛాంబర్ లో పోరాటం చేస్తున్నారు. ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది. అయితే బాహుబలి మాత్రం రేపు రిలీజ్ భారీగా కర్ణాటక అంతటా అవుతోంది.
స్లైడో షోలో ... మరిన్ని విశేషాలు

బాహుబలి రావటమే...
ఇప్పుడు కర్ణాటకలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. బాహుబలి దెబ్బకు ఓ హిట్ కన్నడ సినిమా దెబ్బ అవటం చాలా మంది కన్నడ సినిమా వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

పీవీఆర్ తో సహా
పీవీఆర్ తో సహా చాలా మల్టిఫ్లెక్స్ లు బాహుబలిని వేస్తున్నాయి. అందుకోసం ఈ కన్నడ సినిమాని తొలిగించాయి. కన్నడ ఆడియోన్స్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు.

రాజమౌళి కన్నడ వాడైనా సరే...
రాజమౌళి...కర్ణాటక లోని ..రాయచూరు కు దగ్గరలో చాలా కాలం నివసించానని చాలా సార్లు ఇంటర్వూలలో చెప్పారు. ఇప్పుడు ఆయన వలనే ఓ కన్నడ సినిమాకు ఇబ్బంది కలుగుతోందని అక్కడ మీడియా అంటోంది.

తొలిగిస్తున్నారు
రంగి తరంగ చిత్రాన్ని చాలా మల్టిఫ్లెక్స్ లలో తొలిగించి బాహుబలి కోసం ప్రీ రిలీజ్ టిక్కెట్లు అమ్మకం మొదలెట్టేసారు.

జీర్ణించుకోలేని విషయం
కన్నడ ఫిల్మ్ చాంబర్ లోను ఈ విషయమై చర్చ జరుగుతోంది. ఓ నాన్ కన్నడ చిత్రం కోసం...తమ హిట్ కన్నడ చిత్రాన్ని తొలిగించటం బాధాకరమని చెప్తున్నారు.

పోరాటం జరుగుతోంది
ఈ విషయమై ఫిల్మ్ ఛాంబర్ లో మీటింగ్ జరగనుంది. అయితే ఏం నిర్ణయం తీసుకోవాలనేది డిసైడ్ చేయనున్నారు.

రేటు పెంచారు.
బాహుబలి చిత్రం కర్ణాటకలో సాయి కొర్రపాటి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. టిక్కెట్ రేటు పెంచారు. మూడు వందలకు పెంచి బళ్లారి ధియోటర్ లో వేస్తున్నారు.

వేరే చోట..
బాహుబలిని కర్ణాటకలో రిలీజ్ చెయ్యడానికి భారీ అమౌంట్ పెట్టి ఓ బయ్యర్ కొనుకున్నాడు. కానీ అతను ఈ సినిమాని రిలీజ్ చెయ్యకుండా మంచి ఆఫర్ రావడంతో 5 కోట్ల లాభంతో మరో డిస్ట్రిబ్యూటర్ కి అమ్మేశాడు. దాంతో అతనికి వచ్చిన లాభం అక్షరాల 5 కోట్లు.


Click it and Unblock the Notifications











