Don't Miss!
- Sports RR vs DC: సహనం కోల్పోయిన రిషభ్ పంత్వీడియో
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బాలీవుడ్ టాప్ నిర్మాత పై రేప్ కేసు.... నగ్నంగా ఫొటోలు తీసి, గదిలో బంధించి
బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీ పై హయత్నగర్ పోలీస్ స్టేషన్ లో అత్యాచారం కేసు నమోదయ్యింది. ఒకటీ రెండూ కాదు ఏకంగా నాలుగు సెక్షన్లకింద అతని పై కేసులు నమోదయ్యాయి.
బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీ పై హయత్నగర్ పోలీస్ స్టేషన్ లో అత్యాచారం కేసు నమోదయ్యింది. ఒకటీ రెండూ కాదు ఏకంగా నాలుగు సెక్షన్లకింద అతని పై కేసులు నమోదయ్యాయి. అత్యా చార బాదితురాలు డిల్లీకి చెందిన యువతి బీబీఏ విధ్యార్థిని. అయితే సినిమాలపై ఉన్న ఇష్టం తో ముంబై కి వచ్చి నటుడు అనుపం ఖేర్ కు సంబందించిన ఇనిస్టిట్యూట్ లో శిక్షణ తీసుకుంటున్న సమయం లో కొందరు మితృల ద్వారా కరీం మొరానీ తో పరిచయం జరిగిందనీ...
అవకాశం ఇస్తానని చెప్పి తన ఫ్లాట్కి పిఒలిచి వైన్ లో మత్తుమందు కలిపి ఇచ్చిన మొరానీ తనపై అత్యాచారం చేయటమే కాకుండా తన నగ్న ఫొటోలు తీసి వాటిని చూపించి బెదిరింపులకు దిగాడనీ. తానెక్కడుంటే అక్కడికి రప్పించుకుని మరీ తనమీద పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడనీ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దిల్ వాలే షూటింగ్ టైమ్ లో హైదరాబాద్ కి రప్పించుకుని మరీ శివార్ల లో ఉన్న హొటల్ గదిలో తనని బందించి పలుమార్లు తనమీద అత్యాచారానికి పాల్పడ్డాడని కూడా తెలిపిన యువతి... ఇన్నాళ్ళూ తన కుటుంబం పరువు పోతుందని ఈ విషయాన్ని బయటపెట్టలేదనీ,, కానీ తన సహనం నశించిపోయేంతగా అతని కృరత్వం భరించలేక ఇప్పుడు బయటపెడుతున్నాననీ తెలిపింది.
అంతే కాదు కరీం మొరానీ కి అండర్వరల్డ్ తోనూ మంచి సంబందాలున్నాయనీ, మాఫియాలో ఉన్న చాలామందితోనూ అతనికి పరిచయలున్నాయనీ ఆరోపించింది. ఈ నిర్మాత మొరానీ బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కి అత్యంత సన్నితుడు కావటం గమనార్హం. షారూఖ్ చేసిన రావన్, చెన్నై ఎక్స్ప్రెస్, దిల్ వాలే సినిమాలకు ఇతను సహనిర్మాతగా వ్యవహరించాడు . అంతే కాదు 2జీ స్పెక్ట్రం స్కాం లో ప్రధాన నిందితుల్లో ఇతనూ ఒకడు. ఆకేసులో అరెస్టయ్యాడు కూడా. డీఎంకే కరుణా నిధి కూతురు కళిమొని కి 20% వాటా ఉన్న కళైంగర్ టీవీ కి 200 కోట్లు అక్రమంగా డీబీ రియాలిటీ నుంచి తరలించటం లో సహకరించాడని కూడా ఇతని పై ఆరోపణలున్నాయి.