Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘జబర్దస్త్' రేష్మి లిప్ లాక్ పెట్టి హీటెక్కించింది (వీడియో)
హైదరాబాద్ : రేష్మి, శ్రద్దాదాస్ లను హాట్ గా చూపిస్తూ, కొంచెం ఎ టైప్ సీన్స్ తో హిట్ కొట్టాలనుకుంటున్నారు దర్శకుడు ప్రవీణ్ సత్తార్. ఆయన చందమామ కథలు చిత్రం తర్వాత రూపొందింస్తున్న ‘గుంటూరు టాకీస్' చిత్రం ఓ క్రైమ్ కామెడీగా రెడీ అవుతోంది. ఈ చిత్రం దియోటర్ ట్రైలర్ విడుదలైంది. దానికి సంబందించిన వీడియో ఇక్కడ చూడండి.
ఇప్పటికే సుమారు 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబందించి ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స వేగంగా సాగుతున్నాయి. గుంటూర్ టాకీస్ సినిమా కన్ ప్యూజింగ్ కామెడీ అని, ఈ సినిమా అంతా సింగీతం శ్రీనివాసరావ్ డైరక్షన్ వహించి, కమల్ హాసన్ హీరోగా నటించిన మైకిల్ మదన కామరాజు వలె , ఈ సినిమా లైన్ వుంటుందని అనుకుంటున్నారు.
ఇంకా ఈ చిత్రానికి సంబందించి ఇష్కియా, డీల్లి బెల్లీ తరహాలో మాదిరి రెండు క్యారక్టర్స్ అయిన హరి మరియు 25 సంవత్సరాలున్న కేసనోవా పాత్రల్లో సిద్దు మరియు గిరి నటిస్తున్నారు. శ్రధ్దా దాస్ రాడికల్ రోల్ నటిస్తుండగా, మహేష్ మజ్రేకర్ కూడా బ్యాడీగా కనిపించనున్నారు. వాళ్ళూ ఈ సినిమాలో సొంత వాయిస్ ను వుపయోగించనున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''చందమామ కథలు తరవాత చేస్తున్న చిత్రమిది. ఆ చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. అందుకే నాపై మరింత బాధ్యత పెరిగింది. ఓ సామాజిక స్పృహతో తెరకెక్కుతున్న చిత్రమిది. సందేశంతో పాటు వినోదమూ ఉంటుంది''అన్నారు.
''ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు. లక్ష్మీ మంచు, రఘుబాబు, తాగుబోతు రమేష్, అపూర్వ తదితరులు నటిస్తున్నారు.ఛాయాగ్రహణం: రామిరెడ్డి.పి, కూర్పు: ధర్మేంద్ర కాకరాల.