Don't Miss!
- News ఎన్నికల ప్రచారానికి నేటితో తెర: ఈ రాష్ట్రాల్లో ఎల్లుండి పోలింగ్
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఖరారు: ఓ మై ఫ్రెండ్ తో రవితేజ నెక్ట్స్
హైదరాబాద్ : రీసెంట్ గా 'కిక్ 2' తో వచ్చిన రవితేజ ఇప్పుడు 'బెంగాల్ టైగర్' షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అదే వేడిలో తాజాగా మరో చిత్రం కమిటయ్యారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ చిత్రం కమిటయ్యినట్లు సమాచారం. రీసెంట్ గా వేణు శ్రీరామ్ కలిసి కథ నేరేట్ చేసినట్లు తెలుస్తోంది. రవితేజ ఇప్రెస్ అయ్యి డేట్స్ ఇవ్వటానికి ముందుకు వచ్చినట్లు చెప్తున్నారు. వేణు శ్రీరామ్ గతంలో ఓహ్ మై ఫ్రెండ్ 2011 చిత్రం చేసారు. ఇన్నాళ్లకు ఈ కథని ఓకే చేసారు.
'బెంగాల్ టైగర్' విశేషాలకు వస్తే....
రచ్చతో దర్శకుడుగా తన సత్తా ఏంటో చూపించిన దర్శకుడు సంపత్ నంది.. దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'బెంగాల్ టైగర్'. రవితేజ హీరోగా నటిస్తున్నారు. తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్స్. కె.కె.రాధామోహన్ నిర్మాత. ఈ నెల 8 నుంచి యూరప్లో చిత్రీకరణ జరగనుంది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. దీంతో చిత్రీకరణ పూర్తవుతుంది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
సంపత్ నంది మాట్లాడితే... పులి పంజా విసిరిందంటే ఇక తిరుగులేనట్టే. అదే పులి ఓ పథకం ప్రకారం పంజా విసిరితే? పౌరుషమున్న ఒక పులి అదే చేసింది. మరి అక్కడ ఏం జరిగిందో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు సంపత్ నంది.
దర్శకుడు కంటిన్యూ చేస్తూ.. ''పేరుకు తగ్గట్టుగా బలమైన కథతో రూపొందుతున్న చిత్రమిది. యాక్షన్, భావోద్వేగాలు, వినోదం మేళవించి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. రవితేజ హుషారైన నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. బెంగాల్ టైగర్ అంత పవర్ రవితేజ పాత్రలో కనిపిస్తుంది'' అన్నారు.
''చిత్రీకరణ తుదిదశకు చేరుకొంది. రవితేజ శైలి మాస్ అంశాలతో దర్శకుడు సంపత్ నంది చిత్రాన్ని తీర్చిదిద్దుతున్న విధానం చాలా బాగుంది. మా సంస్థలో నిలిచిపోయే ఓ మంచి చిత్రమవుతుంది'' అన్నారు నిర్మాత.