Just In
- 6 min ago
మెగా హీరోయిన్ ప్రాణాలకు ముప్పు: ఏకంగా పోలీసులకే వార్నింగ్ కాల్స్.. షాక్లో సినీ పరిశ్రమ!
- 11 min ago
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
- 37 min ago
ప్రభాస్ ‘సలార్’లో విలన్గా సౌతిండియన్ స్టార్ హీరో: ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యూటర్న్
- 1 hr ago
సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది.. అలా చేయడమే తప్పా: షకీలా సంచలన వ్యాఖ్యలు
Don't Miss!
- News
అగ్రవర్ణాలకు గుడ్ న్యూస్ చెప్పనున్న సీఎం కేసీఆర్...? 2-3 రోజుల్లో ప్రకటన వచ్చే ఛాన్స్...?
- Sports
'సిడ్నీ టెస్టు తర్వాత ద్రవిడ్ సందేశం పంపించారు.. ఆయన వల్లే మేమిలా ఆడగలిగాం'
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్-దాసరి కాంబినేషన్ వెనక..ఒకే ఒక్క ఫోన్ కాల్!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం టాలీవుడ్లో లీడింగ్ హీరో. ఆయన సినిమాలో ఉంటే చాలు సినిమాకు కలెక్షన్ల వర్షం. ఆయనతో సినిమా చేయడానికి చాలా మంది నిర్మాతలు క్యూలో ఉన్నారు. అయితే ఆ అవకాశం దక్కేది మాత్రం కొందరికే. అయితే దాసరి విషయంలో మాత్రం అలా జరుగలేదు. కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్ తో పవన్ కళ్యాణ్ ఓకే చెప్పారట. దాసరిపై పవన్ కళ్యాణ్కు ఉన్న గౌరవమే ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణమని అంటున్నారు. ఏది ఏమైతేనేం...టాలీవుడ్లో ఓ రేర్ కాంబినేషన్ తెరకెక్కుతోంది. ఇదో సెన్సేషన్ సినిమా అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నారు.
గతంలో పవన్ కళ్యాణ్ ...తన స్వీయ దర్శకత్వంలో జానీ చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం పరాజయంతో ఆ తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టుకోలేదు. అయితే ఇప్పుడు మరోసారి స్వయంగా డైరక్షన్ కు పూనుకోనున్నట్లు తెలుస్తోంది. దాసరి నిర్మించే చిత్రం కోసం పవన్ తిరిగి డైరక్షన్ చేయనున్నారని చెప్పుకుంటున్నారు. అందుకోసం ఆయన గతంలో తాను వర్కవుట్ చేసిన సత్యాగ్రహి స్క్రిప్టుని తీసుకోనున్నట్లు చెప్పుకుంటున్నారు. మరో వైపు ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించే అవకాశం ఉందనే వార్తలు సైతం ప్రచారంలో ఉన్నాయి. ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

ఈ చిత్రం తారక ప్రభు ఫిలిమ్స్ పతాకంపై దాసరి నిర్మిస్తున్న 37వ సినిమా. దర్శకరత్న దాసరి నారాయణరావు - పవన్ కల్యాణ్ కలసి ఓ సినిమా చేస్తున్నారనే వార్త సోమవారం సాయింత్రం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. అది రూమర్ అని కొట్టిపారేసే లోగా దానిని ఖరారు చేస్తూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో ...దాసరి ఈ విషయాన్ని ఖరారు చేస్తూ పోస్ట్ చేసారు. నా నెక్ట్స్ డైరక్షనల్ ప్రాజెక్టు పవన్ కళ్యాణ్తో అని రాసారు. ఇది అభిమానులలో కలకలం పుట్టించింది. దాసరి దర్శకత్వంలో పవన్ సినిమా ఏంటని కంగు తిన్నారు. అయితే ఈ విషయం గమనించినట్లున్నారు...మరి కాస్సేపటికి దాన్ని ఎడిట్ చేస్తూ...నా నెక్ట్స్ ప్రాజెక్టు నిర్మాతగా పవర్ స్టార్ తో అని మార్పు చేసి మళ్లీ పోస్టు చేసారు.