Don't Miss!
- News స్కాట్లాండ్లో ట్రెక్కింగ్ కోసం వెళ్లి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వెర్రి మొర్రి కూతలేం ఉండవని ముందే హామీ
హైదరాబాద్ : హిట్ తో దోబూచులాడుతున్న నారా రోహిత్ ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని అందిపుచ్చుకోవాలనే తపనతో ఉన్నారు. బయిట రీమిక్స్ ట్రెండ్ నడుస్తోంది. బాగా పాపులర్ అయిన పాటలను తమదైన శైలిలో మోడ్రన్ మ్యూజిక్ ని కలిపి వదులుతున్నారు. వాటిలో కొన్ని ఈ కాలంలోనూ హిట్ అయ్యి అందరి ప్రశంసలూ పొందుతూంటే మరికొన్ని సంగీతాభిమానుల ఆగ్రహానికి దారి తీసేలా తయారవుతున్నాయి. దాంతో ఎందుకైనా మంచిదని తాము రీమిక్స్ చేసే పాటలో వెర్రి మొర్రి కూతలేం జోడించం అని ముందే హామీ ఇస్తున్నారు.
మహ్మద్ రఫీ పాడిన తెలుగు పాటల్లో ఓ ఆణిముత్యం..'ఎంతవారుగానీ.. వేదాంతులైనగానీ, వాలు చూపు తాకగానే తేలిపోదురోయ్..' 'భలే తమ్ముడు'లోని ఈ పాట ఎప్పటికీ శ్రోతల్ని అలరిస్తూనే ఉంటుంది. ఇప్పుడీ గీతాన్ని మరోసారి వినిపించబోతున్నారు 'రౌడీఫెలో' చిత్రంలో. నారా రోహిత్ హీరోగా నటిస్తున్న చిత్రమిది. గీత రచయిత కృష్ణచైతన్య దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సన్నీ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో 'ఎంతవారుగానీ..' గీతాన్ని రీమిక్స్ చేస్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''సి.నారాయణరెడ్డి సాహిత్యం, మహ్మద్ రఫీ గానం ఎప్పటికీ మర్చిపోలేం. 'రౌడీఫెలో'లో ఈ పాట వినిపించే సందర్భం కుదిరింది. అందుకే పాటను యథాతథంగా వాడుకొంటున్నాం. ట్రెండ్ అని చెప్పి వెర్రి మొర్రి కూతలేం జోడించకుండా, పాటలో మాధుర్యం ఏ మాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నాం. సన్నీ రీమిక్స్ చేసిన విధానం తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది'' అన్నారు.
నిర్మాత టి. ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.... 'యాక్షన్, కామెడీ, రొమాన్స్ అంశాలు మిళితమైన సినిమా ఇది. దర్శకుడు కృష్ణచైతన్య విభిన్నంగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. 'స్వామి రారా', 'ఉయ్యాల జంపాలా' చిత్రాలకు పనిచేసిన సన్నీ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. 'ఆషికి-2' చిత్రంలో తన గానంతో దేశాన్ని ఉర్రూతలూగించిన గాయకుడు ఆర్జిత్ సింగ్ ఇందులోని అన్ని పాటలూ పాడటం విశేషం' అని తెలిపారు.
మూవీ మిల్స్, సినిమా 5 సంస్థలు నిర్మిస్తున్నఈ చిత్రం షూటింగ్ తుదిదశకు చేరుకొంది. విశాఖా సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రావు రమేశ్, పరుచూరి వెంకటేశ్వరరావు, గొల్లపూడి, పోసాని, తాళ్లూరి రామేశ్వరి, సుప్రీత్, అజయ్, ఆహుతి ప్రసాద్, ప్రవీణ్, సత్య ఇతర ముఖ్యతారాగణం. గీత రచయిత కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా5, మూవీ మిరాకిల్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సన్ని సంగీతం అందిస్తున్నారు.