Don't Miss!
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘రేయ్ విత్ పవనిజం’ పోస్టర్లతో హడావుడి!
హైదరాబాద్: సాయి ధరమ్ తేజ్ తొలి సినిమా ‘రేయ్' షూటింగ్ సమయంలోనే చాలా సమస్యలు ఎదుర్కొంది. షూటింగ్ పూర్తి కావడానికి దాదాపు మూడేళ్లకు పైగా సమయం పట్టింది. షూటింగ్ పూర్తయినా...వివిధ కారణాలతో సంవత్సర కాలంగా విడుదలకు నోచుకోవడం లేదు. ఎట్టకేలకు ఈచిత్రాన్ని మార్చి 27న విడుదల చేసేందుకు రంగం సిద్దమైంది.
ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు అయిన వైవిఎస్ చౌదరి సినిమాకు మంచి ఓపెనింగ్స్ రాబట్టేందుకు తన శక్తిమేర ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్ పేరును సినిమా ప్రచారం కోసం వాడుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ‘రేయ్' మూవీపై స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ‘రేయ్ విత్ పవనిజం' పోస్టర్లు కూడా రిలీజ్ చేసారు.
పవన్ కళ్యాణ్ ఆశీస్సులతోనే ‘రేయ్' మూవీ మొదలైన నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడానికి ఈ అంశాన్ని ఓ సాధనంలా వాడుకోబోతున్నాడు వైవిఎస్ చౌదరి. స్పెషల్గా పవనిజం సాంగును విడుదల చేస్తున్నారు. ఈ సాంగును మార్చి 14న అఫీషియల్ గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. ఇదే రోజు పవన్ కళ్యాన్ జనసేన పార్టీ ఆవిర్భవించిన రోజు. ఈ పాటను ప్రముఖ సినీగేయరచయిత చంద్రబోస్ రాసారు. దివంగత సంగీత దర్శకుడు చక్రి ఈ సాంగును కంపోజ్ చేసారు.
మరో విశేషం ఏమిటంటే.... ‘రేయ్' మూవీ విడుదల తేదీ అయిన మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సినిమా వైపు ప్రేక్షకులను లాగడానికి చౌదరి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో ఈ విషయాలు గమనిస్తే ఇట్టే తెలిసి పోతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓపెనింగ్స్ వరకే.... సినిమా ప్రేక్షకులకు ఏ మేరకు నచ్చుతుంది అనే దానిపైనే జయాపజయాలు ఆధారపడి ఉంటాయనేది వాస్తవం.