Don't Miss!
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- News జగన్ సీఎం కావాలని చెప్పుల్లేకుండా అభిమాని దీక్ష-స్వయంగా వెళ్లి విరమింపజేసిన వైనం..!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
మెగా ఫ్యామిలీ నుండి మరో న్యూ హీరో ఎంట్రీ ఇస్తున్నాడు!
హైదరాబాద్: చిరంజీవి వారసత్వంతో ఆ ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలయ్యారు. ఒక్క అల్లు శిరీష్ తప్ప అందరూ సక్సెస్ అయ్యారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ క్లిక్ అయ్యారు. నాగ బాబు కూడా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నాగ బాబు కూతురు కూడా ఇప్పటికే బుల్లి తెర ద్వారా తానేంటో నిరూపించుకుంది. త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. సినిమా ఫ్యామిలీలో పుట్టడంతో అతనిలోనూ నటుడు కావాలనే ఆకాంక్ష ఎప్పుడో మొదలైంది.
గతంలో చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్' సినిమాలో పేషెంటుగా కూడా నటించాడు. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ తన చదువుకు కొనసాగిస్తూ నటన, డాన్స్, ఫైట్స్ ఇలా వివిధ కేటగిరీల్లో శిక్షణ పొందుతున్నట్లు సమాచారం. కుర్రోణ్ణి చూస్తుంటే హీరో అవ్వాలనే ఉత్సాహం ఉట్టిపడుతోంది.
పలువురు దర్శకులు ఇప్పటికే వైష్ణవ్ తేజ్ ను కలిసారని, కథలు వినిపించారని సమాచారం. అయితే పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకున్న తర్వాతే సినిమా రంగంలోకి వస్తానని అంటున్నాడట వైష్ణవ్ తేజ్. తన తొలి సినిమా ఎంపిక ఎలా ఉండాలన్న విషయంలో అన్నయ్య సాయి ధరమ్ తేజ్ సలహా తీసుకుంటాడట.