twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూన్ లో సెట్స్ పైకి సాయిధరమ్ తేజ్ కొత్త చిత్రం

    |

    సుప్రీం సిద్దమైపోయింది ఇక సాయిధరం కొత్త సినిమాకీ రెడీ అయిపోయాడు. దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. నిన్న సాయంత్రమే రానున్న ఈ కొత్త సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ధరం తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించనున్న ఈ సినిమాకి, నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) ఠాగూర్ మధు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

    ఈ సినిమా రెగ్యులర్ షూటింగును జూన్ 10 నుంచి మొదలుపెడుతున్నారు. యూనిట్ అంతా ఇప్పుడు అందుకు సంబంధించిన సన్నాహాలను ఆరంభించే పనుల్లో వున్నారు.

    'పండగ చేస్కో' తరువాత గోపీచంద్ మలినేని చేస్తోన్న సినిమా ఇది. ఇక సాయిధరమ్ తేజ్ నటించిన 'సుప్రీమ్' మే 5న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ఆయన మరో సినిమా 'తిక్క' సెట్స్ పై వుంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన రామ్ చరణ్, అల్లు అర్జున్ తో కలిసి నటించిన రకుల్, ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ తో జోడీ కట్టడం విశేషం.

    వినాయక్ క్లాప్:

    వినాయక్ క్లాప్:

    మొదటి సన్నిఒ వేశానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టారు..

    స్విచ్ ఆన్ చేసిన అల్లు అరవింద్:

    స్విచ్ ఆన్ చేసిన అల్లు అరవింద్:

    ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. మొదటి సన్ని వేశానికి దర్శకుడు శ్రీను వైట్ల గౌరవ దర్శకత్వం వహించారు.

    జూన్ నుంచీ రెగ్యులర్ షూటింగ్:

    జూన్ నుంచీ రెగ్యులర్ షూటింగ్:

    జూన్ 10 నుంచి రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా లో ధరం తేజ్ పక్కన రకుల్ ప్రీత్ సింగ్ తొలి సారిగా నటిస్తోంది.

    జూన్ లో సెట్స్ పైకి సాయిధరమ్ తేజ్ కొత్త చిత్రం

    జూన్ లో సెట్స్ పైకి సాయిధరమ్ తేజ్ కొత్త చిత్రం

    జూన్ లో సెట్స్ పైకి సాయిధరమ్ తేజ్ కొత్త చిత్రం

    English summary
    Sai Dharam Tej’s movie in the direction of Gopichand Malineni was formally launched on Friday
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X