Don't Miss!
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సైఫ్ అలీ ఖాన్తో ప్రభుదేవా మసాలా ఎంటర్టెనర్
బాలీవుడ్లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ నిర్మించే ఈ చిత్రం 2015లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. జనవరి 23, 2015గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు. ఈ లోగా సినిమాను కంప్లీట్ చేసేందుకు పర్ ఫెక్ట్గా ప్లానింగ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
ప్రస్తుతం ప్రభుదేవా హిందీలో అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా, యామీ గౌతమిలతో ఓ సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు. టైటల్ ఇంకా ఖరారు కాని ఈచిత్రం ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. పూర్తి వినోదాత్మకంగా, కమర్షియల్ ఎంటర్టెనర్గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు టాక్.
తెలుగులో సూపర్ హిట్ అయిన పోకిరి చిత్రాన్ని హిందీలో 'వాంటెడ్'గా రీమేక్ చేసిన ప్రభుదేవా తొలి సినిమాతోనే బాలీవుడ్లో హిట్ కొట్టారు. ఆ తర్వాత ఆయన 2012లో అక్షయ్ కుమార్తో చేసిన 'రౌడీ రాథోడ్' భారీ బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇది తెలుగులో హిట్టయిన 'విక్రమార్కుడు' చిత్రానికి రీమేక్. ఈ రెండు హిట్లతో బాలీవుడ్లో స్టార్ దర్శకుడిగా మారిపోయాడు ప్రభుదేవా.