Just In
- 30 min ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 1 hr ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 2 hrs ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్పై నటి కామెంట్స్
- 2 hrs ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్కు నిదర్శనం
Don't Miss!
- News
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ సక్సెస్... కేవలం 20 మందిలో మైనర్ రియాక్షన్స్...
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
"సైరాత్" హీరోయిన్ బడి బాట:అభిమానుల వల్ల మొదటిరోజే స్కూల్ ఎగ్గొట్టింది
ఇండియన్ సక్సెస్ ఫుల్ మూవీ ఆఫ్ ది యియర్ "సైరత్" లో ఆర్చిగా లీడ్ రోల్ పోషించి దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది నటి రింకు రాజ్గురు. ఈ సినిమాలో ఆ పాత్రను పోషించింది రింకూ రాజ్గురు.సినిమా చేసే నాటికి ఈ అమ్మాయి వయసు 15 ఏళ్ళే అప్పుడు తొమ్మిదో తరగతిలో ఉందీ అమ్మాయి.
ఈ అమ్మడు ప్రస్తుతం పాఠశాలకు తిరిగివెళ్తొంది. తొమ్మిది తరగతి చదువుతున్న సమయంలో ఈ సినిమాలో నటించిన ఆ బాలిక వేసవి సెలవులను పూర్తి చేసుకొని పదో తరగతిలో చేరింది. సెలవుల్లో సినిమా విడుదలై ఘన విజయం సాధించే సరికి అమ్మడి పేరు దేశ వ్యాప్తంగా మారుమోగుతుంది. దీంతో తను పాఠశాలకువస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు పాఠశాల ముందు హడావిడి చేశారంట. దాంతో పాపం మొదటి రోజే స్కూల్ ఎగ్గొట్టాల్సి వచ్చింది. మరి ఇక సంవత్సరమంతా ఎలా వేగుతుందో ఏమో..

మరాఠీలో కేవలం రూ.4 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి దాదాపు రూ. 85 కోట్ల కలెక్షన్లు వసూలు చేసిన సినిమా సైరాత్. నాగ్రాజ్ మంజులే అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్లో సైతం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఉన్నత వర్గానికి చెందిన ఓ అమ్మాయి చేపలు పట్టి జీవనం సాగించే ఓ పేద కుటుంబానికి చెందిన అబ్బాయిని ప్రేమిస్తుంది.

పెద్దలు పెళ్లికి వ్యతిరేకించడంతో అమ్మాయి తన ప్రేమను గెలిపించుకోవడానికి సమాజాన్ని ఎదిరిస్తుంది. పరువు హత్యల నేపథ్యంలో అమ్మాయి, అబ్బాయిని చంపేస్తారు. ఈ నిజ జీవితకథ ఆధారంగా దర్శకుడు నాగ్రాజ్ మంజులే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ సినిమాకి దక్కిన పాజిటివ్ టాక్ చూసి సౌత్ ఇండియన్ ఫిలింమేకర్స్ కూడా ఈ చిత్రం రీమేక్పై కన్నేశారు. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత రాక్లైన్ వెంకటేష్ సైరాత్ సినిమాని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రీమేక్ చేసేందుకు రైట్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది.