Don't Miss!
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
కృష్ణ జింకల వేట కేసు.. సల్మాన్ ఖాన్కు ఊరట
రాజస్థాన్ కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్కు ఊరట లభించింది. ఈ కేసులో తీర్పును రాజస్థాన్ హైకోర్టు జూలై 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చేసిన అప్పీల్పై విచారణ జరుగుతున్నది. వాస్తవానికి గురువారం (ఏప్రిల్ 4వ తేదీ) ఈ తీర్పు వెల్లడించాల్సింది.
అయితే ఈ తీర్పును వాయిదా వేస్తూ ఈ కేసులోని ప్రతీ ఒక్కరు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోర్టు తన ఆదేశాలల్లో పేర్కొన్నది. 1998లో హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్ సమయంలో జోధ్పూర్కు సమీపంలోని కంకణి వద్ద కృష్ణ జింకలను వేటాడినట్టు కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఈ కేసులో సైఫ్ ఆలీ ఖాన్, నీలమ్, టబు, సొనాలి బింద్రే నిందుతులుగా ఉన్నారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 51, 149 కింద కేసు నమోదైంది. ఈ కేసులో సల్మాన్ ఖాన్కు జోధ్పూరు కోర్టు ఐదేళ్ల శిక్షను విధించింది. ఒక రోజు శిక్ష అనంతరం బెయిల్పై సల్మాన్ బయటకు వచ్చారు. ఈ శిక్షను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.